Read more!

ఆంధ్ర రాజధాని శంకుస్థాపన

 

ఆంధ్ర రాష్ట్ర నూతన రాజధాని అమరావతి అని ఖరారైన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో సచివాలయం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈ నూతన రాజధాని అయిన అమరావతికి జూన్ 6న శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొత్త రాజధానికి శంకుస్థాపన చేసేందుకు జూన్ 5, 6, 8 తేదీలు బాగా ఉన్నాయని పండితులు వివరించారని, ఈ తేదీల్లో శంకుస్థాపన జరగకపోతే మళ్లీ వచ్చే సంవత్సరం మార్చి వరకు మంచిరోజులు లేవని చెప్పారని చెప్పారు. ఇందుకుగాను జూన్ 6 వ తేదీన శంకుస్థాపనక చేసేందుకు మొగ్గు చూపినట్టు మంత్రులు చెప్పారు.