ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు, విధి విధానమును తప్పించుట నెవరి తరము అని లవకుశ సినిమాలో ఒక పాట ఉంది. అది ఎంతో అర్ధవంతమైన పాట. విధిని నమ్ముతామా? లేదా అన్నది పక్కనబెడితే వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి జీవితం కూడా అలాగే సాగుతున్నట్లు కనిపిస్తుంది.
మన రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏది మాట్లాడినా, ఏ అభిప్రాయం చెప్పినా ఏదో ఒకటి ఆపాదించే దురదృష్టకర వాతావరణం నెలకొంది. నిజానికి నిష్పక్షపాతంగా ఉండడం, నిజాయితీగా జీవించడం ఎంతో కష్టం. అది ఎప్పుడూ ఉండే విషయమే. కాని గత కొద్ది సంవత్సరాలుగా రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితుల వల్ల ప్రతి అంశంలోనూ అనుమానమే కనిపిస్తోంది.
రాష్ట్రంలో వచ్చే నెలలో జరగబోతున్న ఉప ఎన్నికలు అందరికి ఒక అగ్ని పరీక్ష పెట్టబోతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి తన భవిష్యత్తు ఏమిటో సంకేతాన్ని ఈ ఎన్నిక తెలియచెప్పబోతోంది. ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కోలుకునే అవకాశం ఉందో కూడా ఈ ఉప ఎన్నికలు తేల్చబోతున్నాయి.
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక,టివీ ఛానల్ బ్యాంకు ఖాతాలను స్తంభింప చేస్తూ సిబిఐ తీసుకున్న నిర్ణయం సంచలనాత్మకమైనదే. దేశ చరిత్రలోనే ఇది ఒక అరుదైన సన్నివేశం.
రాజకీయాలలో ఒక ధీరీ ఉంది. సానుకూలం అయినా, వ్యతిరేకం అయినా ఎప్పుడూ జనంలో ప్రచారంలో ఉండాలన్నది ఆ ధీరి చెబుతుంది. గత మూడేళ్లుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ విషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. జగన్ ఒక నాయకుడిగా ఎదిగిన తీరుపై (మేకింగ్ ఆఫ్ ఎ లీడర్) ఎవరైనా పుస్తకం రాయదలిస్తే ఈ పరిశీలన ఆసక్తికరంగా ఉంటుంది.
ఇది మనందరికి తెలిసిన కథే. ఒక రాజుగారు దేవతా వస్త్రాలు ధరించి ఊరేగుతుంటే అంతా చూసి నివ్వెరపోవడమే తప్ప ఎవరూ ఏమీ మాట్లాడలేకపోతుంటే ఒక అమాయక బాలుడు రాజుగారి వంటిపై బట్టలు లేవని అంటాడు. అప్పటికి గాని రాజుగారికి వాస్తవం అర్ధం కాదు. తన వంటిపై దుస్తులు లేవన్న సంగతి అర్థం అయ్యే సరికి పరువుపోయింది. సరిగ్గా ఇలాగే మన రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిని తెలుసుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానానికి ఇంతకాలం పట్టింది.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి క్రిస్టియనా? రెడ్డా? రాష్ట్ర కాంగ్రెస్ నేతలలో కొత్తగా చోటు చేసుకున్న మీమాంస ఇది. ఆయన జీవించి ఉంటే, అధికారంలో కొనసాగి ఉంటే అసలు ఈ ఊసే వచ్చి ఉండేది కాదు. ఇన్ని కొత్త చర్చలకు ఆస్కారం ఉండేది కాదు. కాని కాలం ఎప్పుడూ ఒకేవిధంగా ఉండదు.
మహాభారతంలో తనను నిండు కొలువులోకి తీసుకురమ్మన్నారని వచ్చిన దూతతో ద్రౌపతి ఒక ప్రశ్న అడుగుతుంది. ధర్మరాజు ముందుగా తాను ఓడి, తర్వాత తనను ఒగ్గారా? లేక ముందుగా తనను ఫణంగా పెట్టి, ఆ తర్వాత తాను ఓడారా అన్నది ఆ ధర్మ సందేహం. అందులోని సూక్ష్మం ఏమిటంటే ఏ రకంగా చూసినా అందుకు ధర్మరాజుకు ఉన్న అర్హత ఏమిటని ద్రౌపది ప్రశ్నించడమే.
రాష్ట్ర రాజకీయాలలో ముప్పై ఏళ్లుగా అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం సంక్షోభంలో చిక్కుకుని, ఆ సుడిగుండంలో నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతోందని చెప్పకతప్పదు.
సాగర సంగమం సినిమా గుర్తుందా! అందులో కమల్ హాసన్ పాత్రను ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. అందులో కమల్ హాసన్ మిత్రుడి పాత్ర పోషించిన శరత్ బాబును ఉద్యోగం నుంచి తొలగిస్తే కమల్ హాసన్ ఆ కంపెనీకి వెళ్లి అక్కడి మేనేజర్ ను రెండు తప్పులు చేశావని అంటూ తిరగబడతాడు.
రాష్ట్రంలో రాజకీయంగా కొత్త సమీకరణలకు ఉప ఎన్నికలు నాందీ అవుతాయో లేదో కాని ఈ పదమూడో శాసనసభ ఉప ఎన్నికల విషయంలో రికార్డు సృష్టిస్తోంది. ఇప్పటికే పదహారు నియోజకవర్గాలు ఉప ఎన్నికలకు వెళితే, మరో పాతిక నియోజకవర్గాలు ఎన్నికలకు ఎదురు చూస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సమాజవాది పార్టీ గెలవగానే ఒక మాట అన్నారు. ఇంతకాలం అధికారాన్ని చేపట్టిన బహుజన్ సమాజ్ వాది పార్టీ నేత మాయావతి ఏర్పాటు చేసిన విగ్రహాల జోలికి వెళ్లబోనని, ఆమె విగ్రహాలను సైతం తాము తొలగించబోమని అన్నారు.
కొమ్మినేని శ్రీనివాసరావు
గౌరవ చీఫ్ ఎడిటర్,ఎన్టివ.
1952 నుంచి ఇప్పటివరకు జరిగిన శాసనసభ,లోక్సభ ఎన్నికలకు సంబంధించిన పుస్తకాలను కూడా తయారు చేశాను. రాష్ట్రంలోని ఏ నియోజక వర్గ ప్రముఖులకు సంబంధించిన విశేషాలనైనా తెలుసుకోవచ్చు.పుస్తకరూపంలోకన్నా వెబ్సైట్లో మరింత మందికి అందిబాతులోకి తేవచ్చన్న లక్ష్యంతో ఆ పుస్తకాన్ని ఇందులో ఉంచుతున్నాము.ఇది ఒకరకంగా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన పూర్తిస్థాయి గ్రంథంగా పరిగణలోకి తీసుకోవచ్చు.జర్నలిస్టు మిత్రులకు,రాజకీయరంగంపై ఆసక్తి ఉన్నవారికి విస్తారమైన సమాచారాన్ని దీనిద్వరా అందించవచ్చు. ఇక రాష్ట్రస్థాయిలోను ఆయా జిల్లాలోను జరిగే ముఖ్యమైన రాజకీయ పరిణామలను తెలియచేయడానికి యత్నిస్తాము.
వ్యక్తిగత వివరాలు
జర్నలిజంలో ప్రవేశించిన సంవత్సరం...1978
పనిచేసిన సంస్థలు .. ఈనాడు 1978 - 2002
ఆంధ్రజ్యోతి 2002 -2006
ఎన్టివి..2007 -2007
సెప్టెంబరు టివి 5..2007 సెప్టెంబరు - 2009
ఆగస్టు ఎన్టివి..2009 ఆగస్టు నుంచి...
రాసిన గ్రంధాలు..రాష్ట్రంలో రాజకీయం ఆంధ్ర టు అమెరికా తెలుగు తీర్పు.. 1999,తెలుగు తీర్పు..2004 తెలుగు ప్రజాతీర్పు 2009 (2010 ఉప ఎన్నికలతో సహా) తాజాకలం (రాజకీయ వ్యాసాలసంపుటి) శాసన సభ చర్చల సరళి..1956 - 1960. శాసన సభ చర్చల సరళి..1960 - 1971.


