సుబ్రతో రాయ్ అరెస్ట్ ...

  సుబ్రతో రాయ్ అరెస్ట్ ... సహారా సంస్థ అధినేత సుబ్రతో రాయ్ ను నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి సహారా సంస్థ సేకరించిన డబ్బుల విషయంలో కోర్టు సుబ్రతో రాయ్ కు గతంలో పలుమార్లు నోటీసులు ఇచ్చింది. సహారా నుంచి స్పందన లేకపోవడంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ధిక్కార కేసులో ఇంతకుముందు వాదనలు విన్న అనంతరం సుప్రీం కోర్టు తమ ముందు హాజారు కావాలని సుబ్రతా రాయ్‌ని ఆదేశించింది. అయితే సుబ్రతా రాయ్ కోర్టు ఎదుట హాజరుకాకపోవడంతో ఆయనకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. సుబ్రతా రాయ్‌ని అరెస్ట్ చేసి తమ ముందు మార్చి 4లోగా హాజరుపర్చాలని సుప్రీం కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, తన తల్లి (95)కి ఆరోగ్యం బాగోలేదని, అందువల్ల తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని ఇంతకుముందు సుబ్రతా రాయ్ కోర్టును కోరారు. అయితే కోర్టు అతని వినతిని తిరస్కరించింది. సుబ్రతో రాయ్ ను శుక్రవారం లక్నోలో అరెస్ట్ చేశారని సుబ్రతో రాయ్ సీనియర్ అడ్వకేట్ రామ్ జట్మలాని సుప్రీం కోర్టుకు తెలిపారు.
Publish Date: Feb 28, 2014 1:13PM

విఫలమైన 'టి' కాంగ్రెస్

  విఫలమైన 'టి' కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా పట్టుబట్టి మరీ విభజనను సాధించింది. అయితే ఈ విజయాన్ని తెలంగాణా కాంగ్రెస్ నేతలు తమ నియోజకవర్గాలలో విస్తృత ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యారు. అయితే అటు ప్రెస్ మీట్ లు ఇటు రోడ్ షోలు నిర్వహిస్తూ సోనియా వల్లే తెలంగాణా రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు తప్ప తమ తమ నియోజకవర్గాలలో పర్యటించలేదు. అలాగే జంపింగ్ జపాంగ్ లు కూడా ఎక్కువ అవుతుండటం కూడా కాంగ్రెస్ ను కలవరపెడుతోంది. కాంగ్రెస్ అధిష్ఠానం సీమాంధ్రలో ఎలాగూ గెలిచే అవకాశాలు లేకపోవడంతో తెలంగాణాలోనైనా కొన్ని సీట్లు రాబట్టుకోవాలని చూసింది. టి.ఆర్.ఎస్. అధ్యక్షుడు కెసిఆర్ మీద ఆశలు పెట్టుకుని విలీనానికి పట్టుబట్టింది. కానీ ఇప్పటికీ కెసిఆర్ ఎటూ తేల్చకుండా ఇంకా నాన్చుడుధోరణిలో ఉన్నారు. ఎలెక్షన్లు దగ్గరపడుతుండటంతో తాము అధికారంలోకి రావాలో, రాహుల్ గాంధీని పిఎం సీట్లో ఎలా కూర్చోపెట్టాలో తెలియక తలపట్టుకుంటుంది.
Publish Date: Feb 28, 2014 10:20AM

31న చంద్రబాబు పాదయాత్ర పునఃప్రారంభ౦

        చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు. వైద్యుల సూచన మేరకు చంద్రబాబు పాదయాత్రకు విరామం ప్రకటించారని వారు తెలిపారు. ఈ నెల 31 సాయంత్రం చంద్రబాబు యాత్రను పునఃప్రారంభిస్తారని వివరించారు. అలాగే ఇకపై పాదయాత్ర దూరం విషయంలోకూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తోంది. ఇకపై రోజువారీ దూరాన్ని కూడా తగ్గించనున్నారు. ఇప్పటి వరకూ బాబు పాదయాత్ర 117 రోజులు పూర్తీ చేసుకుంది.
Publish Date: Jan 29, 2013 11:31AM

కాంగ్రెస్ ఎంపీలు భేటి: రాజీనామాలతో నేడు సోనియాకు లేఖ

      తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు. నిన్న పార్లమెంటు సభ్యుడు వివేక్ ఇంట్లో జరిగిన సమావేశంలో తెలంగాణ ఎం.పి.లు ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  స్పీకర్ ఫార్మట్‌లో ఈ రాజీనామాలను పార్టీ అధిష్ఠానానికి పంపించనున్నట్టు కోమటిరెడ్డి చెప్పారు. పదవులు తమకు ముఖ్యమం కాదని వారు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. తెలంగాణకోసం తాము ఎటువంటి త్యాగాలకైనా సిద్ధం అని వారు పేర్కొన్నారు. పదవులు చిత్తుకాగితంతో సమానమని ఎం.పి. మధుయాష్కి పేర్కొన్నారు.
Publish Date: Jan 29, 2013 10:51AM

నారీ నారీ నడుమ జగన్మోహనుడు

  తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది. ఇంట గెలవలేని జయప్రద, సమాజ్ వాది పార్టీ తరపున పోటీ చేసి తనకు బొత్తిగా పరిచయమేలేని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికయి రచ్చ గెలిచింది. అయితే, అక్కడ ఈ మద్యనే పరిస్థితులు వికటించడంతో, మళ్ళీ మూటా ముల్లె సర్దుకొని రాష్ట్రానికి వచ్చేయడానికి నిర్నయించుకొన్నట్లు గత కొంత కాలంగా ప్రకటిస్తూన్నాకూడా, మన రాజకీయ పార్టీల నుండి ఆమెకు కనీస స్పందన కరువయింది. ఇక ఇలాగయితే లాభం లేదనుకొన్నఆమె తానే స్వయంగా ఏదో ఒక పార్టీని ఎంచుకొని తన రాజకీయ జీవితంలో ‘మరో ప్రస్తానం’ మొదలుపెట్టాలని నిర్ణయించుకొంది.   తెలుగుదేశం పార్టీకి ఎన్ని సిగ్నల్స్ పంపినా స్పందించకపోవడంతో, ఇటీవలే పత్రికలవారితో మాట్లాడుతూ ఇక్కడా అక్కడ సైకిలు పార్టీలు తనవంటి సినిమా తారలను పులిహోరలో కరివేపాకులా వాడుకొని వదిలేసాయని అటువంటి పార్టీలకు తానూ దూరంగా ఉండాలనుకొంటున్నట్లు ప్రకటించేసి తెలుగుదేశం పార్టీతో డిల్లీ నుండే తెగతెంపులు చేసేసుకొంది.   అయితే, ఇక మిగిలినవి తల్లీ పిల్ల కాంగ్రెస్ పార్టీలు. తెలంగాణా సమస్యతో పుట్టెడు కష్టాల్లో ఉన్న తల్లి కాంగ్రెస్ ను నమ్ముకొంటే తనకీ అదేగతి పడుతుందని భావించిన ఆమె, రాష్ట్రంలో ప్రజాదారణ ఉన్న పార్టీలోనే తానూ జేరాలనుకొంటునట్లు ప్రకటించేసింది. అంటే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సంకేతం అందించినట్లే భావించవచ్చును. అక్కడ అయితే వయ్యారి గడుసు రోజమ్మ తనకు తోడుగా ఉంటుందని ఆమె భావించినా, ఒకే ఒరలో రెండు కత్తులు ఇముడుతాయలేదా అనేది ఆమె ఆలోచించినట్లు లేదు. ఆమె కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తే ఇక అప్పుడు 'నారీ నారీ నడుమ జగన్మోహనుడు' అని టైటిల్ వేసేసుకోవచ్చును. త్వరలో ఆమె చంచల్ గూడా జైలు నుండి తన రాజకీయ జీవితంలో మరో ప్రస్థానం జయప్రదంగా మొదలుపెట్టవచ్చునని సమాచారం.
Publish Date: Jan 28, 2013 8:57PM

జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా?: కేసిఆర్ ఫైర్

      జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు. చీము , నెత్తురు ఉన్న తెలంగాణ మంత్రులు , ఎమ్.పిలు , కిందిస్థాయి వరకు ఉన్న కాంగ్రెస్ వారంతా పార్టీని వదలాలని ” అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుకు మరిన్ని సంప్రతింపులు జరపాల్సి ఉందని  కేంద్ర మంత్రులు ఆజాద్, షిండేలు ప్రకటన చేయడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణపై చర్చలు ఒక నాటకం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నామనడం ఒక బూటకం అని అన్నారు. తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రులు ఆజాద్, షిండేలు ప్రకటించినా కేంద్రం అనుకుంటే తెలంగాణ ఇవ్వవచ్చని అన్నారు.
Publish Date: Jan 28, 2013 10:15AM

కోటి సంతకాల కధకి సంజాయిషీలు

    వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది. సాధారణంగా విమర్శలు ఎదుర్కొన్న ఏ రాజకీయపార్టీ అయినా తనను తానూ రక్షించుకొనే ప్రయత్నంలో వెంటనే ఆ విమర్శలను ఖండించడమో లేక తనను సమర్దించుకోవడమో లేక దానికి ప్రతి విమర్శలు చేసి ఎదుర్కోవడమో చేస్తుంది. అయితే, వైయస్సార్ కాంగ్రెస్ ఇదివరకు ఒకసారి కోటి సంతకాల సేకరణపై వచ్చిన విమర్శలకు స్పందించినప్పటికీ ఈ రోజు సాక్షి పత్రికలో వచ్చినట్లు సమర్ధంగా లేదు. పార్టీకి సరయిన దశ దిశానిర్దేశం చేసే నాయకుడు లేక పోవడం వల్లనే ఈ జాప్యం అని చెప్పక తప్పదు. ఎట్టకేలకు, ఆ పార్టీకి చెందిన లీగల్ సెల్ కన్వీనర్ ఈ విధంగా స్పందించారు.   “సీబీఐను అడ్డంపెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చేస్తున్న కక్షసాధింపు చర్యలకు నిరసనగా చేపట్టిన సంతకాల సేకరణ రాజ్యాంగ విరుద్ధం కాదు. ఈ విషయంపై టీడీపీ, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు పూర్తిగా అర్థరహితమని ఆయన కొట్టిపారేశారు. తనకు జరిగే అన్యాయాన్ని, అక్రమాలను రాజ్యాంగ పదవిలో ఉన్న వారికి చెప్పుకునే హక్కు, అర్హత దేశంలోని ప్రతీ పౌరుడికి ఉన్నాయని.. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.”
Publish Date: Jan 28, 2013 9:58AM

బాబూ...కబడ్ధార్! కొడాలి నాని

  నిన్నటి మొన్నటివరకు తెలుగుదేశం పార్టీని, నందమూరి కుటుంబాన్ని భుజానెత్తుకొని తిరిగిన కొడాలి నాని, జిల్లా నేతలతో పొసగక తెదేపా కాడి దింపేసి, జగన్ పార్టీ కాడి ఎత్తుకోగానే, అయన కొత్త పల్లవి అందుకొని స్వరం కూడా మార్చారు. చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు. బహుశః జిల్లాలో అయన చేస్తున్న పాదయాత్రవల్ల తన అనుచరులు మళ్ళీ తనను వీడి ఎక్కడ తెలుగుదేశం పార్టీలోకి జంపు చేస్తారననే భయంవల్లనో లేక, జిల్లాలో తన ఉనికిని ప్రదర్శించడం అవసరమని భావించడం వల్లనో కొడాలి నాని చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.   చంద్రబాబుపై ఎదురు దాడి చేస్తూ “మా నాయకుడి గురించి, మా పార్టీ గురించి అడ్డమయిన మాటలాడితే నీ అవినీతి బాగోతాలన్ని నేను బయట పెడతాను. ఇప్పటికయినా నీ దుష్ప్రచారం ఆపకపోతే నేను కూడా రాష్ట్ర పర్యటన చేసి నువ్వు చేసిన తెరవెనుక కుట్రలన్నిటినీ ప్రజల ముందు పెడతాను. కబ్డదార్ చంద్రబాబు!” అంటూ చాల తీవ్ర స్వరంతో హెచ్చరించారు.   అయితే, కొడాలి నాని ఇంత తీవ్రంగా స్పందించదానికి మరో కారణం కూడా ఉండవచ్చును. చంద్రబాబును కూడా ఎదిరించగల నాయకుడిగా తనను తానూ ప్రదర్శించుకొని, తద్వారా జగన్ పార్టీకి కృష్ణ జిల్లాలో తనే ప్రముఖ నాయకుడిగా నిలవాలనే తాపత్రయంతోనే అయన చంద్రబాబుని లక్ష్యం చేసుకొని మాట్లాడి ఉండవచ్చును. నిజంగా ఆయనకి తన నాయకుడిని, పార్టీని చంద్రబాబు విమర్శించడం కష్టమనిపించిఉంటే, ఆయన ఇదివరకే స్పందించి ఉండేవారు. కానీ, అప్పుడు మౌనంగా ఊరుకొని చంద్రబాబు తన జిల్లాలో అడుగుపెట్టాకనే స్పందించడం చూస్తుంటే, తన పార్టీపై ప్రేమ కన్నా తన రాజకీయ భవిష్యత్ ఎక్కడ దెబ్బతింటుందో అనే బెంగే ఆయనలో ఎక్కువగా కనబడుతోంది.
Publish Date: Jan 28, 2013 9:37AM

అర్ధగంట గడువివ్వండి ప్లీజ్

  రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను దిక్కరిస్తూ ముందుకు సాగాలని నిర్ణయించడంతో జంట నగరాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ ప్రాంగణంలో ప్రవేసించబోయిన తెలంగాణా జేయేసీ నేత స్వామీ గౌడ్ ను, తెరాస నేత కే.తారక రామారావును, రాజ్ భవన్ వైపు ర్యాలీగా బయలుదేరిన ఉస్మానియా విద్యార్దులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వారి అరెస్టులకు నిరసనగా తెలంగాణా జేయేసీ చైర్ మ్యాన్ ప్రొఫెసర్ కోదండరాం తదితరులు తమ కార్యాలయం బయటనే ధర్నాకు కూర్చొని, మిగిలిన నేతలు మరికొందరు రాగానే ఇందిరా పార్క్ కు ర్యాలీగా బయలుదేరుతామని ప్రకటించడంతో హోం శాఖ అప్రమత్తమయింది. కొద్ది సేపటి క్రితం హోం మంత్రి సబితా ఇంద్ర రెడ్డి స్వయంగా విధాన సభ్యుడు చుక్కా రామయ్యకు ఫోన్ చేసి ఒక అర్ధ గంటలో ప్రభుత్వ నిర్ణయం తెలుపుతామని చెపుతూ అంతవరకు వారిని ఇందిరా పార్క్ వైపు వెళ్ళకుండా ఆపమని సూచించారు.
Publish Date: Jan 27, 2013 11:55AM

బాబు పాదయత్రకి బ్రేక్?

  నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు. అయితే, ఇప్పటికే కాలి నొప్పులతో ఇబ్బందులు పడుతున్న ఆయన, ఈ రోజు కాలి చిటికన వ్రేలు మరింత వాచిపోవడంతో వైద్యుల సలహా మేరకు రేపు అనగా ఆదివారం తన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి ఒక రోజు పూర్తీ విశ్రాంతి తీసుకొనేందుకు అంగీకరించారు.   అయితే, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొంటూ రేపు జిల్లా నాయకులూ, కార్యకర్తలతో సమావేశం అయ్యి, నేతల మద్య నెలకొన్న విబేధాలు తొలగించే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఎన్నికలు ముంచు కోస్తున్న తరుణంలో పార్టీకి కంచుకోట వంటి కృష్ణా జిల్లాలో నేతల మద్య తలెత్తుతున్న తీవ్ర విబేధాల వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోవడమే గాకుండా, ఇతర పార్టీలకు తమ కంచుకోటలోకి ప్రవేశం కల్పించినట్లవుతుంది అని భావిస్తున్న చంద్రబాబు రేపు జిల్లా నేతలతో సమావేశం అయి పరిస్థితులను చక్క దిద్దే ప్రయత్నం చేయవచ్చును.
Publish Date: Jan 26, 2013 11:15PM

సమరదీక్షకు అనుమతి నిరాకరించిన పోలీసులు

  తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుతంగా తాము దీక్షలు చేసుకొంటామంటే నిరాకరించడం తమ హక్కులను కాలరాయడమేనని అన్నారు. ఒకవైపు సమైక్యాంద్రావాదుల సభలకు ఎటువంటి అభ్యంతరమూ తెలుపని ప్రభుత్వం తమ సభలు సమావేశాలకు మాత్రం అభ్యంతరం తెలపడాన్ని వారు ఆక్షేపించారు. ప్రభుత్వం పక్షపాత వైఖరితో ప్రవర్తిస్తూ తమ తెలంగాణా గడ్డపై తమకు స్వేచ్చ లేకుండా చేస్తోందని ఆరోపించారు.   అయితే, గతంలో ప్రొఫెసర్ కోదండరాం వంటి నేతలు, తెలంగాణా కు చెందిన కాంగ్రెస్ నేతలతో, మంత్రులతో ప్రభుత్వంపై తీవ్రమయిన ఒత్తిడితెచ్చి సాగించిన ‘మిలియన్ మార్చ్’ సందర్భంగా ఎదురయిన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొనే అనుమతికి నిరాకరించి ఉండవచ్చును. మరో రెండు రోజుల్లో అంటే జనవరి 28వ తేదిన కేంద్రప్రభుత్వం ఎటువంటి సానుకూల ప్రకటన చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని ప్రభుత్వాన్ని బెదిరిస్తున్న తెలంగాణా నేతల హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని, ఇటువంటి కీలక తరుణంలో సమరదీక్షలకు అనుమతినీయడం ఆత్మహత్యా సదృశ్యమే అవుతుందని ప్రభుత్వం భావించినందువల్ల కూడా వారికి అనుమతి నిరాకరించి ఉండవచ్చును. నిన్న రాజమండ్రీలో ఉండవల్లి అద్వర్యంలో సమైక్యాంద్రా వాదుల సభకు ప్రభుత్వం అనుమతినీయడం, తమకు అనుమతి నిరాకరించడం కూడా తెలంగాణా నాయకులకు ఒక ఆయుధంగా మారిందని భావించవచ్చును. అయితే, రాజధానిలో శాంతి భద్రతలే ముఖ్యం గనుక ప్రభుత్వం అనుమతి నిరాకరించాడానికే మొగ్గు చూపిందని భావించవచ్చును.
Publish Date: Jan 26, 2013 9:09PM

ఉండవల్లి కాదు..ఉసరవెల్లి : హరీష్ రావు

        "వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి సిఎల్‌పి నాయకుడిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను గురించి 41మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ హైకమాండ్‌ వద్దకు పంపినప్పుడు ఉండవల్లి ఎందుకు వ్యతిరేకించలేదు. టిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుని తెలంగాణపై హామీ ఇచ్చినప్పుడు… కరీంనగర్‌ సభలో సోనియాగాంధీ ప్రసంగాన్ని అనువాదం చేసినప్పుడు, రాష్ట్రపతి పార్లమెంట్‌లో ప్రస్తావించినప్పుడు ఉండవెల్లికి సమైక్యాంధ్ర గుర్తుకు రాలేదా” అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఉండవెల్లి అరుణ్ కుమార్ ను విమర్శించారు. ఆయన ఉండవల్లి కాదు, ఒక ఊసరవెల్లి అని ఎద్దేవా చేశారు. ఆయన జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొని, 2009 డిసెంబర్‌ 9వ తేదీ తర్వాత తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటని అభిప్రాయపడి, ఇప్పుడేమో సమైక్యాంధ్ర సభ పెట్టడం విడ్డూరం అని అన్నారు. ఈ సభలో పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ పాల్గొనడ మేమిటని, ఆయన ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీకి అధ్యక్షులా, ఆంధ్ర ప్రాంతానికి మాత్రమేనా అని హరీష్‌ రావు ప్రశ్నించారు. రాజమండ్రి సభలో వైఎస్సార్‌సిపి, దాని అధ్యక్షులు జగన్‌ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం, ఆయన ఎందుకు జైళ్లో ఉండాల్సి వచ్చిందో ప్రజలకు వివరించకపోవడం పలు అను మానాలకు దారితీస్తుందని అన్నారు.
Publish Date: Jan 26, 2013 12:12PM