మంజిస్టాతో రక్త శుద్ధి...

మంజిస్టా అసలు నామధేయం రుబియా కార్డిఫోలియా పెరెన్నెల్ క్లైంబర్  దీని తో  లింఫ్ ను కదిలిస్తుంది.రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం లింఫ్ అంటే రస మరియు రక్త అంటే మొదటి టిష్యూ శరీరం ఇరుకుగా కదలలేని స్థితి లో ఉంటుంది.ఎందుకు అంటే డెటొక్షిఫయింగ్ ప్రాపర్టీ అలాగే  తదనంతరం ఇతర ఇదు రకాల కణ జలాలను తీవ్ర ప్రభావితం చేయకముందే ప్రాధమిక స్థాయిలో శరీరం లోని కణజాలాలు వారసత్వంగా ఆయుర్వేదంఎందుకు ఉన్నత స్థానం ఇవ్వబడిందో లింఫ్ ఫ్లోయింగ్ లింఫ్ ఒక సీట్ లాంటిది ఇమ్మ్యున్ సిస్టమ్  ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యం గా  కనిపిస్తారు.శరీరం లోని  చర్మం పని తీరు మెరుగు పడుతుంది.శరీరంలో చర్మం పెద్ద అవయవం అది డిటోక్షిఫై చేసే అవయవం. మంజిస్ట మొక్క  చర్మం అంతా విస్థరించ గలదు. చాలా ప్రభావవంతం గా  ఆర్టిరియల్,సర్క్యు లే టరీ   సిస్టమ్,చర్మం    పై పని చేస్తుంది. మంజీస్టాదీని పేరు సాహిత్యం పరం గా దీని  అర్ధం ఎర్రటి ఎరుపు. అందుకే దీని వేరు ఎర్రగా ఉంటాయి. దీనిని ఆయుర్వేదంలో దీనిని లింఫ్ -మూవింగ్  ఈ మొక్కలో క్లీసింగ్ ప్రాపర్టీ ఇతర మొక్కల్లో ఎర్ర వెళ్ళు సీనో దస్ అమెరికనుస్ ను రెడ్ రూట్ గా పిలుస్తారు.దీనిని ఇది హై లింఫ్ మూవేర్స్ గా ఆయుర్వేదం లో  ఉన్నత స్థానం ఉందని అంటారు ఆయుర్వేద వైద్యులు.మంజీస్టా సహజంగా గుత్తి రూపం లో ఉంటుంది. దీనిని ధాతువుగా చూస్తారు. కణ జాలం అలాగే శరీరంలో ఎక్కువగా ఉన్న పిత్త తత్వాన్ని, కఫంని నిలువరిస్తుంది. మీ శరీరంలో పిత్త తత్వాన్ని సారి చేస్తుంది. ప్రత్యేకంగా రక్తం పెంచు తుంది.పిత్త తత్వాన్ని బాలన్స్ చేయడం లో మంజిస్టా ప్రతిభ లేదా  స్త్రీలలో వచ్చే నెల సరి  సమస్యల పరిష్కారం చేయడం లో స్త్రీలకు సహాయ పడుతుంది మంజీష్టా.స్త్రీలలో వచ్చే రెప్రోడక్టివ్  సిస్టమ్  ముఖ్యం గా పిల్లాల పుట్టుక లింఫ్, మంజీస్ట ను ఉత్తమ మైన మూలికగా చర్మానికి పని చేస్తుంది.చర్మం లో వచ్చే దద్దుర్లు ఇతర సమస్యలు శరీరంలోని పూర్తిగా పునర్నిర్మిస్తుంది.
Publish Date: Mar 27, 2024 8:30PM

టీతో బిస్కెట్లు తినే అలవాటుందా.. కొంపమునిగినట్టే.. ఇవి తింటే ఎన్ని లాబాలో!

ఉదయం లేవగానే రోజు మొదలుపెట్టాలంటే టీ కావాలి. డ్యూటీ మధ్యలో కాస్త బయటకు వెళ్ళాలంటే టీ బెస్ట్ సాకు, సాయంత్రం స్నేహితులతో కలసి టీ కొట్టు దగ్గర కబుర్లు చెబుతూ చాయ్ తాగితే ఆ ఫీల్ వేరు.  టైమ్ పాడు లేకుండా టీ తాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. టీ కొట్టు ఓపెన్ చేశాక కట్టేసేవరకు స్టౌ మీద టీ ఉడుకుతూనే ఉంటుందంటే టీ కి ఉన్న గిరాకీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు టీ కహానీ ఎందుకంటారా? టీ అంటే అందరికీ ఇష్టం. మరీ ముఖ్యంగా వేడి వేడి టీలో బిస్కెట్లు ముంచుకుని తింటే మరీ ఇష్టం. ఇరానీ ఛాయ్, ఉస్మానియా బిస్కెట్లు, అప్పటికప్పుడు హాట్ హాట్ గా బేక్ చేసిన బిస్కెట్లు.. ఓయబ్బో టీ పక్కనే వయ్యారాలు పోతాయి బిస్కెట్లు. కానీ టీతో బిస్కెట్లు తినడం మహా ఇష్టమైన వారికి బ్యాడ్ న్యూస్.. దీని వల్ల బోలెడు నష్టాలున్నాయి. టీతో బిస్కెట్ తింటే కలిగే నష్టాలేంటి? టీ తో ఏం తింటే ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి? పూర్తీగా తెలుసుకుంటే.. భారతదేశంలో టీ తాగేవారు ఎక్కువ. ఇక టీ బిస్కెట్ కాంబినేషన్ కు ఫ్యాన్స్ ఎక్కువ. అయితే టీ బిస్కెట్ వల్ల ఆరోగ్య నష్టాలున్నాయి. యువతలో హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి  టీ తో బిస్కెట్ తినడం ఒక కారణంగా తెలుస్తోంది. టీ బిస్కెట్ కాంబినేషన్ గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. బిస్కెట్లలో సోడియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. ఇది గుండెజబ్బులకు ప్రధానకారణం అవుతుంది. బిస్కెట్ల తయారీకి శుద్ది చేసిన పిండి, శుద్ది చేసిన పంచదార ఉపయోగిస్తారు. ఇది శరీరంలో ఇన్సులిన్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది. ఈ ఇన్సులిన్ హార్మోన్ అసమతుల్యత కారణంగా మధుమేహం ప్రమాదం పెరుగుతుంది. మరొకవైపు ఇది జీర్ణక్రియను కూడా దెబ్బతీస్తుంది. దీని వల్ల మలబద్దకం వస్తుంది. బిస్కెట్లు ఎక్కువగా ప్రాసెస్ చేయబడే ఆహారం. ఇందులో  BHA (butylated hydroxyanisole),  BHT (butylated hydroxytoluene) ఉంటాయి. ఇవి మానవ శరీరంలో ఉండే DNA ను దెబ్బతీస్తాయి. మరీ ముఖ్యంగా బిస్కెట్లలో హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్  ఉంటుంది. ఇది శరీరంలో హార్మోన్లను డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి టీతో బిస్కెట్లు తినడం ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుంది. టీతో వేయించిన శనగలు తింటే.. వేయించిన శనగలు ఆరోగ్యానికి చాలా మంచిదం. టీ టైమ్ లో స్నాక్ గా వేయించిన శనగలు తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. వేయించిన శనగలు ఇన్సులిన్ ను కంట్రోల్ చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే బి-కాంప్లెక్స్ విటమిన్ ఉంటుంది కాబట్టి బి-విటమిన్ లోపాన్ని జయించవచ్చు. ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం, మెగ్నీషియం శనగలలో పుష్కలంగా ఉంటుంది. శనగలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ అయిన కోలిన్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాబట్టి టీతో బిస్కెట్లకు బదులు వేయించిన శనగలు తింటే మంచిది.                                          *నిశ్శబ్ద.  
Publish Date: Mar 26, 2024 12:38PM

హోళీ పండుగ కావాలంటే!

  హోళీకి రసాయనాలతో చేసిన మందులు వాడవద్దు, వీలైనంతవరకూ సహజసిద్ధంగా దొరికే మందులనే వాడండి. పిచికారీ చేసేటప్పుడు జాగ్రత్త, బెలూన్లను వాడవద్దు, పిల్లలని ఓ కంట గమనించుకోండి... అంటూ రకరకాల సూచనలు వినిపిస్తూ ఉంటాయి. మనం వాటిని పాటించినా, నలుగురిలోకి వెళ్లి హోళీ ఆడేటప్పుడు రసాయనాల రంగులతో ముద్ద కాక తప్పుదు. అందుకోసం ఈ జాగ్రత్తలు తీసుకుని తీరాల్సిందే... ఇలాంటి బట్టలు హోళీ అడేటప్పుడు పాతబట్టలు వేసుకున్నామో లేదో గమనిస్తామే కానీ... అవి రంగుల నుంచి ఏమేరకు అడ్డుగా నిలుస్తాయో పట్టించుకోము. హోళీ అడేటప్పుడు ఒంటిని వీలైనంత కప్పి ఉంచే దుస్తులను ధరించాలి. అవి కూడా కాటన్ దుస్తులైతే మరీ మంచిది. ఎందుకంటే పాలిస్టర్ బట్టల మీద పడిన రంగులను అవి పీల్చుకోవు సరికదా... వాటి మీద మరోసారి నీటిని కుమ్మరించగానే ఆ రంగులన్నీ మళ్లీ ఒంటి మీదకి జారతాయి. శరీరానికి తగినంత తేమ పొడబారిన చర్మం మీద పడే రంగుల చర్మరోగాలకు దారితీస్తాయి. అందకనే చర్మాన్ని తేమగా ఉంచుకోవాలి. అందుకోసం ఒంటినిండా కాస్త నూనెని పట్టించడం మేలు. అది మరీ అతిగా కనిపిస్తుందనుకుంటే... అందుబాటులో ఉన్న మాయిశ్చరైజింగ్ లోషను ఏదన్నా రాసుకోవచ్చు. జుట్టు పాడవకూడదనుకుంటే, తలకి మాత్రం నూనె పట్టించాల్సిందే! ఇక హోళీ ఆడేముందు వీలైనంత మంచినీరు తాగడం వల్ల చర్మం లోపలినుంచి తేమగా ఉంటుంది. అదే పనిగా తిరగొద్దు హోళీ ఆడిన తరువాత చాలామంది అవే రంగులతో గంటల తరబడి కాలక్షేపం చేస్తుంటారు. కానీ వీలైనంత త్వరగా ఆ రంగులను వదిలించుకోవడమే మేలంటున్నారు. పైగా ఒంటినిండా రంగులతో ఎండలో కనుక తిరిగితే వాటిలోని రసాయనాలు మన చర్మానికి అంటుకుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి... హోళీ ఆడిన వెంటనే నేస్తాలకు గుడ్బై చెప్పేసి స్నానం చేసేయమంటున్నారు. నయనం ప్రధానం కాపర్ సల్ఫేట్, మెర్యురీ, లెడ్, క్రోమియం.... ఇలా హోళీ రంగుల కోసం వాడే రసాయనాల జాబితా చాలా పెద్దది. ఇవి నోట్లోకి వెళ్లినా, కంట్లో పడినా కూడా హాని జరుగుతుందని వేరే చెప్పనవసరం లేదు. అందుకనే కళ్లజోడు పెట్టుకుని హోళీ ఆడితే మంచిది. అలా కుదరని పక్షంలో కంట్లో ఏవన్నా రంగులు పడినప్పుడు, వెంటనే వీలైనంత నీటితో కంటిని కడుక్కోవాలి. కళ్లని శుభ్రం చేసుకున్న తరువాత కూడా కళ్లు మండుతున్నా, కళ్ల వెంబడి నీరు కారుతున్నా, దృష్టి మసకగా ఉన్నా... వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాల్సిందే! స్నానం ఇలా హోళీ ముగిసిన తరువాత చేసే స్నానం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒంటి మీద పడిన రంగులను తక్షణం శుభ్రం చేసుకునేందుకు చాలామంది పెట్రోల్, కిరసనాయిల్ వంటి పదార్థాలు వాడతారు. వీటితో చర్మం మరింత పొడిబారిపోతుంది. వీలైతే మామూలు సబ్బుతో కాకుండా పిల్లల సబ్బుతో రుద్దుకోవడం మంచిదంటారు. స్నానం ముగిసిన తరువాత కూడా మరోసారి ఒంటికి మాయిశ్చరైజింగ్ లోషను పట్టిస్తే మరీ మంచిది. - నిర్జర.
Publish Date: Mar 25, 2024 8:06PM

హోలీ రంగుల వల్ల పొంచి ఉన్న ప్రమాదం!

హోళీ ఓ రంగుల పండుగ. కానీ అజాగ్రత్తగా ఉంటే, అవే రంగుల ఇతరుల జీవితాలలో చీకటిని నింపుతాయని హెచ్చరిస్తున్నారు. పిల్లవాడు తాగే పాల దగ్గర నుంచీ అంతా కలుషితం అయిపోతున్న ఈ రోజులలో, హోళీ సందర్భంగా ఎక్కడపడితే అక్కడ చవకగా దొరికే రంగుల గురించి చెప్పేదేముంది. మరి హోళీలో వాడే రంగులలో ఎలాంటి రసాయనాలు ఉంటాయో, వాటికి ఎలాంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలో ఆలోచించాల్సిందే రంగు – ఆకుపచ్చ ఉపయోగించే రసాయనం – కాపర్ సల్ఫేట్. విషప్రభావం – కొంట్లో పడితే చాలా ప్రమాదకరం. కళ్లు నీరుకారడం, ఎర్రబడటం, వాయడం జరగవచ్చు. ఒకోసారి తాత్కాలికంగా చూపు కూడా కనిపించకుండా పోవచ్చు. రంగు – ఎరుపు ఉపయోగించే రసాయనం – మెర్క్యురీ సల్ఫేట్. విషప్రభావం – చర్మం మీద ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒకోసారి చర్మ కేన్సర్కు కూడా దారితీయవచ్చు. గర్భిణీల శరీరంలోకి కనుక ఇది చేరితే వారి కడుపులో ఉన్న శిశువు ఎదుగుదల మీద తీవ్ర ప్రభావం చూపవచ్చు. ఒకోసారి ఆ శిశువుకి ప్రాణాంతకంగా కూడా మారుతుంది ఈ రసాయనం. రంగు – నీలం ఉపయోగించే రసాయనం – ప్రష్యన్ బ్లూ. విషప్రభావం – మాడు మీదా చర్మం మీదా దద్దుర్లు. రంగు – సిల్వర్ ఉపయోగించే రసాయనం – అల్యూమినియం బ్రొమైడ్. విషప్రభావం – చర్మం, ఊపిరితిత్తుల మీద తీవ్ర ప్రభావం. కేన్సర్ కారకం. రంగు – నలుపు ఉపయోగించే రసాయనం – రెడ్ ఆక్సైడ్. విషప్రభావం – మూత్ర పిండాల మీద ప్రభావం. గర్భస్రావం అయ్యే ప్రమాదం. చాంతాడంత జాబితా! గులాల్ పొడులలో లెడ్, క్రోమియం, కాడ్మియం, నికెల్, జింక్, సిలికా, మైకా... వంటి నానారకాల రసాయనాలూ కలుస్తాయని తేలింది. వీటిలో ఒకో రసాయనానిదీ ఒకో దుష్ఫ్రభావం! ఇక హోళీ రంగులు మెరిసిపోతూ ఉండేందుకు వాటిలో గాజుపొడి కలుపుతారన్న ఆరోపణమూ వినిపిస్తున్నాయి. పేస్టు లేదా ద్రవరూపంలో ఉండే రంగులది మరో సమస్య. వీటిలో ఇంజన్ ఆయల్ వంటి చవకబారు ద్రవాలను కలిపే ప్రమాదం ఉంది. ఈ రసాయనాలతో ఆరోగ్యం ఎలాగూ దెబ్బతింటుంది. హోళీ రోజున అవి నీటిలోనూ, నేలమీదా పడితే పర్యావరణం కూడా దెబ్బతింటుంది. కొత్త పోకడలూ ప్రమాదమే! ఇప్పుడు కొత్తగా హోళీ రంగులను చల్లుకునేందుకు చైనావారి పిచికారీలు దొరుకుతున్నాయి. వీటికి తోడు రంగులతో నింపిన బెలూన్లు కూడా లభిస్తున్నాయి. అసలే రసాయనాలు... ఆపై వాటిని వేగంగా చల్లేందుకు పరికరాలు. దీంతో ఏ రంగు ఎవరి కంట్లో పడుతుందో, అది ఎవరి జీవితాన్ని చీకటి చేస్తుందో తెలియని పరిస్థితి. ఒక్కసారిగా మీదపడే బెలూన్ల వల్ల ఒకోసారి వినికిడి కూడా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి రంగుకీ ఓ  ప్రత్యామ్నాయం హోళీలో ఇతరులు చల్లే కృత్రిమమైన రంగుల నుంచి జాగ్రత్తపడటం ఒక ఎత్తు. మనవరకు మనం అలాంటి రంగుల జోలికి పోకుండా సహజసిద్ధమైన రంగులు వాడటం మరో ఎత్తు. ప్రతి ఇంట్లోనూ దొరికే పసుపు, కుంకుమ, చందనం, బొగ్గు లాంటి రంగులు పదార్థాలు ఎలాగూ బోలెడు రంగలకు ప్రత్యామ్నాయంగా ఉంటాయి. ఇక ఆకుకూరలు, గోరింట పొడి, బీట్రూట్, కరక్కాయలు, మందారపూలు, నేరేడు పండ్లు లాంటివాటితో చాలా రంగులే సిద్ధమవుతాయి. కాస్త ఓపిక చేసుకుంటే తేలికగా అమరిపోయే సహజసిద్ధమైన రంగులను వదిలేసి ఏరికోరి రసాయనాలు కొనితెచ్చుకోవడం ఎందకన్నదే పెద్దల ప్రశ్న! - నిర్జర.  
Publish Date: Mar 24, 2024 5:30PM

ఆరోగ్యకరమైన హోళికి ఆరోగ్య చిట్కాలు!

హోళి అంటే ఇష్టం లేనిది ఎవరికి?? చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు హోళి సందడిలో తమవంతు పాత్ర పోషిస్తారు. అయితే హోళి సంబరాలలో అక్కడక్కడా అపశ్రుతులు చోటుచేసుకుంటు ఉంటాయి. హోళిని హాయిగా ఎంజాయ్ చేస్తూ.. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు అవసరం. మీ చర్మ సంరక్షణ తప్పనిసరి:  చర్మాన్ని వీలైనంత జిడ్డుగా చేయడం చాలా ముఖ్యం, తద్వారా రంగులు చర్మం మీద  వ్యాప్తి చెందడానికి లేదా అంటుకునే అవకాశం ఉండదు. ఇందుకోసం కొబ్బరి నూనె రాసుకోవచ్చు. కొబ్బరి నూనె వల్ల మరొక లాభం ఏంటంటే చర్మం పొడిబారకుండా చేస్తుంది. అలాగే శరీరం మీద రంగులు క్లీన్ చేయడం సులువు అవుతుంది.   సేంద్రీయ రంగుల ఎంపిక:   పర్యావరణ అనుకూలంగానే కాకుండా మన చర్మానికి కూడా అనుకూలమైన రంగులతో హోలీని జరుపుకోవాలి. హానికరమైన రసాయనాలు కలిపిన రంగులను నివారించాలి. రసాయనాలు కలిపిన రంగులు ప్రకాశవంతంగా కనిపిస్తాయి అంతేకాఫు ఇవి నీటిలో చాలా తొందరగా కలిసిపోతాయి. ఈ రంగులు  చర్మం నుండి తొలగించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. చర్మాన్ని డ్యామేజ్ చేస్తాయి. ఇన్ఫెక్షన్లు, సైడ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. బంతి పువ్వు, గులాబీ, మందారం, చెట్ల ఆకులు, పసుపు ఇలా పువ్వుల రెక్కల నుండి రంగులు తయారుచేసుకోవచ్చు. .  హైడ్రేటెడ్ గా ఉండాలి:  హోలీ వేసవిలో వస్తుంది, హోళి సమయానికి వేసవి మొదలైపోయి ఉంటుంది. దీనివల్ల బయట ఎండలు భగ్గుమంటుంటాయి. ఈ ఎండల్లో రంగులు చల్లుకుని ఎంజాయ్ చేసినా.. మరొకవైపు ఎండ దెబ్బ మాములుగా ఉండదు.  కాబట్టి హైడ్రేటెడ్ గా ఉండటం చాలా అవసరం. నీరు, గ్లూకోజ్, జ్యూస్‌లు, శరీరాన్ని తిరిగి శక్తివంతం చేయడంలో సహాయపడతాయి.  పైగా ఇవి చర్మం పొడిబారకుండా తేమగా ఉండేలా చేస్తాయి.   కళ్ళను తేలిగ్గా తీసుకోవద్దు:  మీరు రోజూ  కాంటాక్ట్ లెన్స్‌లను ధరించేవారు అయితే, రంగులతో ఆడుకునే ముందు వాటిని తీసివేయడం మంచిది. కళ్ళజోడు మీద రంగులు లేదా నీళ్లు పడితే ఎదుటి ప్రాంతాన్ని మసగ్గా కనిపించేలా చేస్తాయి. ఇది ఇబ్బందే అనుకోవచ్చు. అలాగని కళ్ళజోడు లేకుండా హొలీ ఆడేటప్పుడు రంగులు నేరుగా కళ్ళలోకి పడకుండా అజాగ్రత్త పడాలి. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. కాబట్టి కళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి.  స్వీట్ల దగ్గరా జాగ్రత్త:  హోలీ సమయంలో మార్కెట్‌లో కల్తీ ఖోయా, మావా అమ్ముతారు. ఇంకా ఇలాంటి కల్తీ పదార్థాలతో స్వీట్లు తయారుచేస్తారు. ఇలాంటివే ఆఫర్స్ కింద, డిస్కౌంట్ల కింద అమ్మేస్తారు. కాబట్టి స్వీట్స్ కొనేముందు జాగ్రత్తగా ఉండాలి. .  శరీరాన్ని ఇలా కవర్ చేయాలి: హొలీ ఆడేటప్పుడు యావరేజ్ గా ఉన్న బట్టలు వేసుకోవాలి. దీనివల్ల వాటిమీద రంగులు వదలకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ కొత్త బట్టలు అయితే నాశనం అయిపోతాయి. ఫుల్ హాండ్స్ ఉన్న టాప్స్, ఫుల్ గా కాళ్లను కవర్ చేసే ప్యాంట్స్ వేసుకోవాలి. దీనీవల్ల రంగులు శరీరాన్ని పాడుచేసే అవకాశం తక్కువ. పాత డెనిమ్ జీన్స్, పొడవాటి పైజామాలను ఎంచుకోవచ్చు.  ఇలా ఆరోగ్యకరమైన హోళిని ఎంజాయ్ చేసి, ఆరోగ్యంగా ఉండండి.                                    ◆నిశ్శబ్ద.
Publish Date: Mar 23, 2024 10:30AM

రోజూ రెండు సార్లు దంతాలు శుభ్రం చేసుకోవాలా? అలా చేయకుంటే ఏం జరుగుతుందంటే!

  నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని ఓ సామెత ఉంది. అదే విధంగానే నోటి ఆరోగ్యం బాగుంటే శరీరం కూడా చాలా వరకు ఆరోగ్యంగానే ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నోటి ఆరోగ్యం గురించి చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. నోటి దుర్వాసన, పంటి నొప్పి, చిగుర్ల సమస్యలు వంటివి ఎదురైనప్పుడు, పళ్లు చాలా సున్నితంగా మారిపోయినప్పుడు తప్ప చాలామంది దంతవైద్యులను సంప్రదించడం, దంత సంరక్షణ తీసుకోవడం చేయరు.  అయితే నోటి ఆరోగ్యం, దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే  రోజూ రెండుసార్లు పళ్లు తోముకోవాలని అంటున్నారు దంత సంరక్షణ నిపుణులు. ఈ అలవాటు వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుంటే.. కావిటీస్ ..   రోజూ రెండు సార్లు  పళ్ళు తోముకోవడం వల్ల చెడు బ్యాక్టీరియా అభివృద్ధి చెందే అవకాశాలు తగ్గుతాయి. అదేవిధంగా ఆహారం తీసుకున్నప్పుడు  దంతాల మధ్య ఇరుక్కున్న  ఆహారం తాలూకు అవశేషాలు తొలగించడంలో సహాయపడుతుంది. దంతాల మధ్య ఇరుక్కున్న ఆహారం నమూలాలు చెడు బ్యాక్టీరియాను, ఈ చెడు బ్యాక్టీరియా యాసిడ్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఇది దంతాల ఎనామిల్‌ను క్షీణింపజేస్తుంది. ఇది దంత క్షయానికి కారణమవుతుంది. చిగుళ్ల వ్యాధి..   రెగ్యులర్ గా రోజుకు రెండుసార్లు బ్రషింగ్ చేయడం వల్ల చిగుళ్ళలో మంట,  ఇన్ఫెక్షన్ కలిగించే ఫలకం,  బ్యాక్టీరియాను తొలగించడం సాధ్యమవుతుంది. ఇవి  చిగుళ్ల వ్యాధిని నివారించడంలో సహాయపడతాయి. చిగుళ్ల వ్యాధి చికిత్స చేయకుండా వదిలేస్తే దంతాలకు నష్టం వాటిల్లి  తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. ఎలక్ట్రిక్ టూత్ బ్రష్..   ఇప్పట్లో చాలామంది  ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌తో బ్రష్ చేస్తుంటారు.  మాన్యువల్ టూత్ బ్రష్‌తో పోల్చితే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌లు నోటిని పూర్తిగా శుభ్రపరచడంలో మరింత ప్రభావవంతంగా ఉంటాయి. సాధారణ దంత పరీక్షలు.. రెగ్యులర్ గా రోజుకు రెండు సార్లు  బ్రషింగ్ చేయడం నోటి పరిశుభ్రతను పెంచుతుంది. అలాగే  మొత్తం దంత ఆరోగ్యాన్ని  కాపాడుతుంది. దంతసంరక్షణలో భాగంగా అప్పుడప్పుడు చెకప్ చేయించుకుంటూ ఉంటే దంతాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు అయినా ముందుగానే తెలుసుకుని వాటికి తగిన నివారణా చర్యలు తీసుకోవచ్చు. దంతాల నష్టం .. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం ద్వారా దంతాల మీద ఏర్పడే  ఫలకం,  బ్యాక్టీరియాను క్రమం తప్పకుండా తొలగించడం సాధ్యమవుతుంది. దీనివల్ల  క్షయం లేదా చిగుళ్ల వ్యాధి కారణంగా దంతాలకు కలిగే  నష్టాన్ని నివారించవచ్చు. దంతాలు ఆరోగ్యంగా ఉండాలన్నా, దంతాలకు కలిగే నష్టాన్ని ముందుగానే తెలుసుకుని నివారించాలన్నా నోటి శుభ్రత, నోటి సంరక్షణ చర్యలు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా ముఖ్యం.                                                        *నిశ్శబ్ద.
Publish Date: Mar 22, 2024 1:04PM

ఏడిస్తే ఎన్ని లాభాలో...

మనిషి అన్నవాడికి స్పందించడం అవసరం అంటే కొన్ని సందర్భాలలో ఆనందం తో కన్నీరు వస్తే. బాధతో కన్నీరు వస్తుంది. అలా కన్నీరు పెట్టుకుంటే లాభమే. అని పరిశోదనలో తేల్చారు.కన్నీరు వల్ల లాభామ నష్టమా అన్న విషయం లో నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందామా మరి. కొందరికి కన్నీరు అస్సలు రాదు.కొందరికి కన్నీరు అతికష్టం మీద వస్తుంది. కొందరికి కన్నీరు అలవోకగా వస్తుంది.వాళ్ళ నెత్తిన నీళ్ళ కుండ ఉందేమో అని అనిపించే విధంగా అదే ధారగా కన్నీరు పెట్టుకుంటూ దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తారు.కొందరు మనసులో ఉన్న బాధను దుఖం రూపం లో బయటికి వెళ్ళ గాక్కుతారు.పొర్లి పొర్లి ఏడుస్తూ ఉంటారు.గతం తలుచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు. బాహాటంగా మనస్పూర్తిగా ఏడవడం లేదా కుళ్ళి కుళ్ళి ఏడవడం మనం గమనించ వచ్చు.అసలు కన్నీరు పెట్టుకుంటే లాభమా నష్టమా చూద్దాం. మనిషి ఏడవడం దుఃఖించడం ఒక సాధారణ ప్రక్రియ.ఒక్కోరిలో ఒక్కో భావనలు ఉంటాయి.దానికి బదులుగా దుఃఖం పెల్లుబికి బయటికి వస్తూ ఉంటుంది.అసలు మనిషి ఎందుకు ఏడు స్తాడో దుఃఖం తో ఎందుకు ఇబ్బంది పడుతున్నాడో తెలుసా? మీరు ఆలోచించారా ? ఈమేరకు శాస్త్రజ్ఞులు చేసిన పరిశోదనలు పలు ఆశక్తి కరమైన అంశాలు వెలుగు చూసాయి.మనము ఏడవడం ద్వారా మనశరీరం, మెదడు రెండూ కీలక మని కనుగొన్నారు.అప్పుడే దానిఫలితాలు మనకు అందుతాయని అన్నారు. పిల్లవాడు పుట్టిన వెంటనే మొదటి సారి ఏడుస్తాడు.అసలు ఏడవడం ద్వారా వచ్చే లాభాము మీకు తెలియదు. ఏడవడం వల్ల వచ్చే లాభాలు అశక్తి కలిగించే అంశాలు తెలుసుకుందాం. 1)శరీరం డీ టాక్సీ ఫై అవుతుంది. *కన్నీరు మూడు రకాలు...  *రిఫ్లెక్స్ ద్వారా వచ్చే కన్నీరు...  *అదే పనిగా వచ్చే కన్నీరు...  *భావనాత్మ కంగా వచ్చే కన్నీరు... *రిఫ్లెక్స్ వల్ల వచ్చే కన్నీరు... కంటిలో పేరుకు పోయిన మట్టి,ఇతర పనికిరాని చెత్త అది కంటిని శుభ్రం చేస్తుంది. అదే పనిగా కంటి నుండి కన్నీరు ప్రవహిస్తుంటే అది మీ కళ్ళు చేమ్మగిల్లినట్లు. ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తుంది.భావనాత్మకంగా వచ్చే కన్నీరు ఒత్తిడి వల్ల,లేదా ఉద్వేగాల వల్ల కన్నీరు బయటికి వస్తుంది.అవి మరల వేరే టాక్సిన్స్ ఉన్నట్లు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. కన్నీరు మన శరీరం లో ఉన్న వస్తువుల్ని శరీరం నుండి బయటికి వస్తుంది. మిమ్మల్ని మీరు శాంతింప చేసుకోవడం కన్నీరు సహకరిస్తుంది.. మన మనస్సు శాంత పరుచుకోవాలంటే ఏడవడం మంచి పద్ధతి.పరిశోదనలో ఏడవడం ద్వారా సింథటిక్ నర్వస్సిస్టం యాక్టివేట్ కావడాన్ని గమనించవచ్చని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. తద్వారా మన శరీరానికి కొంత ఉపశమనం కల్పించడం లో సహకరిస్తుంది.కొంత సేపు ఏడ్చిన తరువాత శాంతం గా ప్రాశంతం గా ఉన్నట్లు  అనుభూతి పొందుతారు. మీకు సహకారం లభిస్తుంది.. ఒక వేళ మీరు నిరాశ చెందినట్లయితే ఏడవడం ద్వారా మీ చుట్టుపక్కల ఉన్నవారికి మీకు సపోర్ట్ అవసరం.అని భావిస్తారు.చిన్న పిల్లలు సైతం తమ పై దృష్టి పెట్టాలంటే ఏడవడం ఆయుధం గా వాడతారు.ఇలా చేయడం ద్వారా తాము అనుకున్న లక్ష్యం పూర్తి చేసామని  భావిస్తారు. దుఃఖం నుండి బయటికి రావడానికి దోహదం చేస్తుంది.. ఏడవడం లేదా దుఃఖించడం అన్నది ఒక ప్రక్రియ దుఃఖం పడడం,ఆగ్రహంతో కూడా దుఃఖం వస్తుంది.ఎడుస్తున్నప్పుడు ఏడ్చే సమయంలో ఒక పద్ధతి ప్రకారం ఏడవడం అవసరం దీనిద్వారా దుఃఖం నుండి బయటికి వచ్చినట్లు బరువు దిగి పోయినట్లు భావిస్తారు. నొప్పి నివారిస్తుంది.. దీర్ఘ కాలం పాటు ఏడవడం వల్ల ఆక్సిటోసిన్ మరియు ఎండార్ఫిన్ విడుదల అవుతుంది.ఇది ఫీల్ గుడ్ కెమికల్స్ గా పేర్కొన్నారు.శారీరక భావనాత్మక రెండువైపులా ఉన్న భావనను మనసులోని బాధను నివారించేందుకు సహకరిస్తుంది.ఒక్కో సారి ఎండోర్ఫిన్ విడుదల అయినప్పుడు మీ శరీరం ఒక నియమిత హద్దు వరకు వినే ప్రయత్నం చేస్తుంది.మన శరీరంలో ఉన్న ఆక్సిటోసిన్ ప్రశాంతత ఇస్తుంది. మూడ్ లో మార్పు వస్తుంది.. మన బాధను నొప్పిని తగ్గించడం లో సహకరిస్తుంది.ఏడవడం ద్వారా మీ మూడ్ కూడా బాగా అద్భుతంగా ఉంటుది.సత్వరంగా స్వేచ్చగా ఉండే విధంగా మీ మెదడు చల్ల బడుతుంది.మీ మెదడులో ఉన్న వేడి తగ్గినప్పుడు మెదడు చల్ల బడుతుంది.మీ మెదడులో ఉన్న వేడి తగ్గినప్పుడు చల్ల బడుతుంది.శారీరకంగా బాగా తేలికగా ఉన్నట్లు అనిపిస్తుంది. భావనలను నియంత్రిస్తుంది... ఏడవడం అన్నది బాధ పడడం అన్నది మరొకరి బాధకు ఏడుపుకు జవాబుగా కాదు.చాలా సార్లు ఎప్పుడు ఏదైనా చాలా ఆనందం గా ఉంటారు. భయం లేదా ఒత్తిడి లో యాలె విశ్వ విద్యాలయం పరిశోధకులు అంటున్న మాట  ఏమిటి అంటే ఈ విధంగా బాధపడడం వల్ల మిమ్మల్ని మీరు నియంత్రించు కునేందుకు సహకరిస్తుంది. అసలు సహజంగా ఎప్పుడు ఎప్పుడు ఏడుస్తారు.. భయంకర మైన ఒత్తిడిలో ఉన్నప్పు డు ,లేదా తాను అనుకున్న లక్ష్యం లో ఓటమి పాలై నప్పుడు.తనకు కావాల్సిన ఆప్తులైన వారు దూరమై నప్పుడు. లేదా తమకి ఇష్టమైన వారే తమను తీవ్రంగా ద్వేషించి నప్పుడు కుళ్ళి కుళ్ళి ఏడవడం పొర్లి పొర్లి ఏడవడం.మనకు కనిపిస్తుంది. మానసిక భావోద్వేగాలతో  ముడి పడిన సంఘటనలకు కారణంతామే అని భావించిన వారు.అనుకోని విధంగా అనూహ్య విజయం సాధించినందుకు ఆనంద భాష్పాలు కంటినుండి వస్తాయి. వైద్య చికిత్స ఎప్పుడు అవసరం... ఏడవడం ఎలాంటి వస్తువంటే మీకు సుఖం లభిస్తుంది.బాధ కలుగుతుంది.అందుకు ప్రతిగా మీరు ఏడుస్తారు అది సర్వసాధారణం మీరు ఏడవడం వల్ల మీరు బాగా ఉన్నట్లు భావిస్తారు.ఇలా చేస్తున్నందుకు సిగ్గు పడవద్దని ఏడుపు వచ్చినప్పుడు మనస్త్రుప్తిగా ఏడవండి. ఆబాధనుండి విముక్తి పొందండి. ఏదైనా విషయం లో ఆనందం లభిస్తుందో.లేదా దుఃఖం కలిగిస్తుందో చాలా సార్లు అప్పుడు కూడా ఏడుస్తారు.అత్యంత సుఖంగా ఉన్నప్పుడు ఒత్తిడులు ఉన్నప్పుడు కూడా ఏడుస్తారు.అత్యంత సుఖంగా ఉన్నప్పుడు ఒత్తిడులు ఉన్నా ఎడుస్తారని ఏలే విశ్వవిద్యాలయం శాస్త్రజ్ఞులు అంగీకరిం చారు.ఏడవడం వల్ల భావనాత్మక నియంత్రణ బయటికి వస్తుంది.సహాయ పడుతుంది. ఏడుపు మంచిదే.                      
Publish Date: Mar 21, 2024 1:30PM

కొవ్వు పదార్థాలు గుండెకి మంచిదేనా?

నూనె పదార్ధాలు,బాగా కొవ్వు ఉన్న పదార్ధాలు తింటే హై బిపి గుండె జబ్బులకు దారి తీస్తుందని.అందరికీ తెలుసు.అసలు ఎలా ఏర్పడుతాయో తెలుసా? మనం తీసుకునే ఆహారం లోనే కొవ్వు కడుపులోకి చేరుతుంది,కలిసి పోతుంది. అది రాక్తనాలాలకు చేరుతుంది.కొన్నాళ్ళు గడిచాక రాక్తనాళా లలో చేరి నిలువ ఉంటుంది కొవ్వు రక్త నాళాల లోపలి గోడల మీద పేరుకుంటుంది. ఇలా పేరుకు పోవడం మూలంగా రక్తనాళాల లోపలి మార్గం ఇరుకుగా ఉండి దీనితో రక్త నాళం లో రక్త ప్రవాహానికి అవరోధం ఏర్పడి అది హై బిపి కి దారి తీస్తుంది. ముఖ్యమైన అవయవాలకి చేరాల్సిన రక్త ప్రవాహానికి అవరోదం ఏర్పడే సరికి రకరకాల జబ్బులు ఏర్పడతాయి ఆజబ్బులు ఈ క్రింది రకాలుగా వుంటాయి. గుండెకు రక్తాన్ని తీసుకు పోయే రక్త నాళాలు ఇరుకుగా ఉండడం తో చాతిలో నొప్పి వస్తుంది. గుండెకు రక్తాన్ని తీసుకు పోయే రక్త నాళం ఏదైనా పూర్తిగా పూడిపోతే పక్షవాతం వస్తుంది. శరీరంలోని ఏదైనా అవయవానికి రక్తాన్ని తీసుకుపోయే నాళం పూడుకుపోయినా గాంగ్రీన్ ఏర్పడుతుంది. ఆయా కుటుంబాలలో ఎవరికన్నా గుండెజబ్బులు లేదా హై బిపి లాంటివి వున్న వాళ్ళు తాము తీసుకునే ఆహారంలో కొవ్వు తక్కువ వుండేట్లు గా చూసుకోవడం చాలా అవసరం. గుండె కవాటం మూలంగా,లేదా గుండే కవాటం లోపం మూలంగా కూడా రక్త నాళాలలో సమస్యలు రావచ్చు.
Publish Date: Mar 20, 2024 2:30PM

కాలి పిక్కల నొప్పికి కారణాలు..

  మీ కాళ్ళ లో పిక్కలలో నొప్పులు ఉంటె అది పెరిఫెరల్ హార్ట్ డిసీజ్ అని మీకు తెలుసా?... మీ కాళ్ళలో క్రామ్ప్స్ వస్తే అది ప్యాడ్ కావచ్చు స్ట్రాన్ ఫర్డ్ కు చెందిన ఒక ప్రముఖ నటుడు జాసన్ గ్రే హస్రత్ ఫైల్యూర్ అయ్యింది. గిన్నెలు శుభ్రం చేస్తున్న ఒక వృద్ధురాలికి గుండె ఏమైంది. దీనికి కారణం ఏమిటి ఈ అంశం పై మరింత సమాచారం మీకోసం. మీ కాళ్ళలో క్రామ్ప్స్ వస్తున్నాయా? మీరు వ్యాయామం చేస్తున్న ప్పుడు మీ కాళ్ళు మరింతగా నొప్పికి గురి అయ్యుంది అంటే అది ప్యాడ్ అని అంటున్నారు నిపుణులు. ప్యాడ్ అంటే... ప్యాడ్ అంటే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ దీనిని తక్షణం పరీక్షించుకోవాలి.అని నిపుణులు సూచిస్తున్నారు.పెరిఫెరల్ హార్ట్ డిసీజ్ రావడానికి కారణం మీ ఆర్టరీ లో ఫ్లాక్స్ వృ ద్ది కావడమే. అలా మీ కాళ్ళలో ఫ్లాక్స్ ఉంటె అది మీ రక్త ప్రసారానికి నియంత్రిస్తుందని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వృద్ధులు 6౦ -నుండి 7౦ సంవత్సరాల వారి పై దీని ప్రభావం 1౦ %మాత్రమే  ఉంటుంది.ప్యాడ్ తీవ్రంగా ఉన్న కేసుల్లో ఫ్లాక్స్ లేదా క్లాట్స్ వల్ల ఒక్కోసారి కాలు తీసివేయాల్సిన పరిస్థితి వస్తుంది. అని అంటున్నారు  పెంస్ట్ ల్ కు చెందినా డాక్టర్ మేత్యుస్ సిం డ్రిక్ వ్యాస్క్యులర్ సర్జన్. ఈ విషయం స్పష్టం చేసారు. ప్యాడ్ -లక్షణాలు... ప్యాడ్ పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ తోలిదశలో లక్షణాలు కనపడవు. సహజంగా తరచుగా కాళ్ళలో నొప్పి వస్తూ ఉంటుంది.కారణం మీ కండరానికి సరిపడా ఆక్సిజన్ లేదా న్యుట్రీ షియన్  అందకపోయి ఉండవచ్చు. ప్యాడ్స్ బాగా వృద్ది చెందితే చాలా తీవ్రంగా ఉంటుంది. ఫ్లాక్స్ ఒక కాలు,లేదా రెండు కాళ్ళ లోనూ రావచ్చు.వ్యాయామం  చేస్తున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు తీవ్రంగా నొప్పి రావచ్చు. కారణం మీ కండరాలకు ఆక్సిజన్ అందక పోవడమే అది మరింత వృధీ చెందితే అక్కడ గాయాలు మొదలు అవుతాయి. ఆప్రదేశంలో గడ్డలు ఫ్లాక్స్ ఏర్పడతాయి. లేదా పాదాలలో గాయం మానదు. అదే పనిగా కాళ్ళలో నొప్పులు వస్తే లేదా కాళ్ళ లో స్పందన లేకపోవడం తిమ్మిరి పట్టింసట్లుగా ఉంటె అది గ్యాంగ్రిన్ కావచ్చు. వ్యాస్క్యులర్ సమస్యలు పెరుగుతూ పోతాయి.సరైన నిర్ధారణ డయాగ్నోసిస్ లేకుండా రోగులకు గాయాలు అయినవారికి పదాలలో వచ్చే గాయాలు మానవు. ఈ అంశం పై సిండ్రిక్ పెన్ స్టేట్ విడుదల చేసింది. ప్యాడ్ ను సత్వరం గుర్తించిన వెంటనే దానిని మధ్యలోనే చికిత్స చేయాలి.ప్యాడ్ కు సంబందించిన లక్షణం కనపడగానే మీరు మీ డాక్టర్ ను సంప్రదించాలి. అది మీరు తీసుకునే ఆహారం లో మార్పులు వ్యాయామం మందులు పద్దతులు ఉపయోగించి బ్లాక్  అయిన  ఆర్టరీ కి చికిత్స చేస్తారు. ప్యాడ్ లో మీ జన్యుపరమైన అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి 5 గురిలో 4 గురికి ప్రమాదం లో ఉన్నట్లే. పొగ త్రాగడం హై బిపి కొలస్త్రాల్ హై బ్లడ్ షుగర్ డయాబెటీస్ ఉంటె ప్రామాదమే అని అంటున్నారు. నిపుణులు. పొగ తాగారో అది మీ కాళ్ళ నొప్పులు ఫ్లాక్స్ ను దగ్గరుండి మరీ నడిపిస్తుంది. ప్యాడ్ ఉన్న వారిలో ఒక వేళ రక్త ప్రవాహం నిలిచిపోతే వ్యాయామం చేయడం ముఖ్యం . ఈ సమస్యనుండి బయట పడడానికి డాక్టర్ ను సంప్రదించాలి శస్త్ర చికిత్స చేయాల్సి వస్తే దీర్ఘకాలిక ప్రయోజనం ఏమిటి అన్న విషయాన్ని పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. కాళ్ళ నొప్పులే కదా అని నిర్లక్ష్యం చేసారో భారీ మూల్యం తప్పదు.                                      
Publish Date: Mar 19, 2024 2:10PM

మూడ్‌కి ఆహారానికి సంబంధం ఏమిటి?

మనిషి ఒక్కో సారి ఒక్కో మూడ్ లో ఉంటాడు. గురువుగారు మంచి  మూడ్ లో ఉన్నారు. లేదా మూడ్ బాగాలేదు అని సహజంగా వింటూ ఉంటాం.అయితే వ్యక్తి మూడ్ లో ఉండాలంటే  ఆహారమే కీలకం అని అంటున్నారు నిపుణులు. మనిషిని మూడ్ లో ఉంచేది అవుట్ అఫ్ మూడ్ కు తీసుకు పోయేది ఆహారమే అంటున్నారు. మన మూడ్ ను సరి చేసేది మనం తీసుకునే ఆహారామే అంటున్నారు నిపుణులు. అసలు ఆహారానికి మూడ్ కు సంబంధం ఏమిటి?అన్నదే ప్రశ్న? మీరు ఎప్పుడైనా ఆకలిగా ఉందని భావించారా? ఉదయం కాని,సాయంత్రం కాని,రాత్రి కాని  ఆకలి వేసి ఉండవచ్చు.అసలు మనిషికి ఆకలి లేని వారు అంటూ ఉండరు. చివరి సారి మీరు ఏమి తిన్నారు?అన్న విషయం చాలా ఆసక్తిగా ఆలోచిస్తారు.? అలా అనిపించడానికి చాలా కారణాలు ఉన్నాయి,అవి పాస్తా,కావచ్చు,కేక్ కావచ్చు,క్యాండి  కావచ్చు.క్యాండీ మిమ్మల్ని ఎప్పుడూ మూడ్ లో ఉంచదు.అయితే మీ ఒక్కరేకాదు. ఒక పరిశోదన ప్రకారం కొన్ని ఆహార పదార్ధాలు తినాలని అనిపిస్తాయి.కొన్ని మనల్ని భయ పెడతాయి. కొన్ని ఆహార పదార్ధాలుకార్బన్లు  తీసుకోవడం వల్ల చక్కెర శాతం పెంచుతాయి.మనం దానిపై దృష్టి  పెట్టం కొన్ని సందర్భాలలో ఆహారం తీసుకున్నాక అలిసి పోయేట్లు చేస్తాయి.ఇక అసలు విషయం  ఏమిటి అంటే  పెరుగు మన మూడ్ ను పెంచుతుంది అంటారు. మరో పరిశోదనలో పళ్ళు తినడం ద్వారా కూరగాయలు శాఖాహారం తీసుకోవడం వల్ల ప్రోటీన్  శాతం తగ్గడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మరో పరిశోదనలో మీరు తీసుకునే పెరుగు వల్ల సెరొటోనిన్ న్యూరో ట్రాన్స్ మీటర్ గా పనిచేస్తుంది.దీని ప్రభావం తో  మన ఫీలింగ్స్ భావాలు వ్యక్తం అవుతాయి.దీనివల్ల ఆనందం ఆరోగ్యం గా ఉంటాయి. మీరు ఎలాంటి ఆహారం తీసుకుంటారో అది అలాంటి ప్రభావం చూపిస్తుంది.అనే విషయాన్నీ దీనివల్ల వచ్చే ప్రభావం  12 రోజుల్లో చూడవచ్చు. మన శరీరంలో ఆహారం  వల్ల వచ్చే ప్రభావం ఉంటె మీ ఆహారం లో మార్పులు చే సుకోవచ్చు. ఆహారం వల్ల  మనం ఎదుర్కునే సవాళ్ళు... మీ భోజనం లో ఆహారం తీసుకునే సమయం నుంచి మూడ్ ట్రాకింగ్ జర్నల్ లో రాయండి మీరు ఏమి తీసుకున్నారో ఏమి తీసుకోలేదో  ప్రతి రోజూ అది కొన్ని నిమిషాలు మాత్రమే  మా ఆహారంలో ఉండే చాయిస్ మీకు అవగాహన కల్పిస్తుంది.అసలు మనం ఏం తింటున్నాం? ఎందుకు తింటున్నాం?అన్న విషయం తెలుస్తుంది.అవగాహన కలుగుతుంది. ఈ అంశానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు మీరు వేసుకోండి. మీరు ఏం తింటారు?భోజనం తరువాత మీరు తీసుకునే స్నాక్స్ అల్పాహారం ఏం తీసుకుంటారు? ఒక వేళ మీరు తినేంత సమయం లేకుంటే ఒక ఫోటో తీసుకుని రికార్డ్ చేయండి.అది మీకు కొంత మేర  మీకు సహకరిస్తుంది.అన్న విషయాన్ని ఒక జర్నల్ గా లేదా నోట్ యాప్,ఫుడ్ ట్రాకర్ ను మీ ఫోన్ లో తయారు చేసుకోండి తినక ముందు మీ  ఫీల్ ఏమిటి? ఎలా ఉన్నారు? ఏ సమయంలో మీకు ఆకలి వేసింది.?ఒంటరిగా ఉండాలని అనిపించింది?.ఒత్తిడికి గురి అయ్యారా? అలా ఉండడానికి మీరు తీసుకున్న ఆహారం కావచ్చు. అది మిమ్మల్ని ప్రభావితం చేసి ఉండవచ్చు,లేదా మీరు ఆహారం తీసుకున్నప్పుడు అలసటగా భావించారా? మీరు ఏ అహారాం థేసుకున్నప్పుడు తీపి పదార్ధాలు స్వీట్స్ ఇతర పదార్ధాలు మీ పంటిని ప్రభావితం చేసాయి. ఒత్తిడికి గురికావడానికి ఉప్పు పదార్శాలు చిప్స్,వేపుళ్ళు,వంటి పదార్ధాలు మీ ఫీలింగ్స్ గుర్తించ వచ్చు. ఫీలింగ్స్ కి ప్రవర్తనకి సంబంధం ఉందా ఇది మార్పుగా భావించాలి. తిన్న తరువాత మీరు ఎలా ఫీల్ అవుతారు... ఉదాహరణకి మీరు తీసుకున్న ఆహారం మీకు శక్తి నిచ్చిందా?లేక స్వాంతన చేకురిందా, త్రుప్తి నిచ్చిందా? అనందం కలిగించిందా?మీ మూడ్ ను ఆహారం ఏరకం గా ప్రభావితం చేసింది. దీనిప్రభావం వల్ల భవిష్యత్తులో తెలివైన నిర్ణయం తీసుకోగల నిర్ణయానికి సహకరిస్తుంది. కొంత మంది నిపుణులు  నిర్వహించిన సర్వేలో మనం తీసుకునే ఆహారం మనమూడ్ ను  ప్రభావితం చేస్తాయని నిర్ధారించారు.
Publish Date: Mar 18, 2024 12:30PM

పరగడుపున తులసి ఆకు తింటే ఆ సమస్యలన్నీ పరార్!

భారతీయ సంస్కృతిలో తులసికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్కను దైవంతో సమానంగా కొలుస్తుంటారు. దైవంతో సమానంగా కొలిచే ఈ తులసి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పరగడుపున ఖాళీ కడుపుతో తులసి ఆకులను తీసుకుంటే పలు శారీరక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. తులసి ఒక అడాప్టోజెన్. ఇందులో విటమిన్లు ఎ, సి,  కాల్షియం, ఐరన్, జింక్ వంటి అనేక పోషకాలను కలిగి ఉంటుంది. అంతేకాదు ఇందులో అధిక మొత్తంలో ప్రోటీన్, ఫైబర్ కూడా ఉంటుంది. తులసి ఆకులను ఆయుర్వేదంలో అనేక రకాల వ్యాధులకు చికిత్సలో ఉపయోగిస్తారు. తులసిని తీసుకోవడం వల్ల ఎక్కువ శారీరక శ్రమ, ఇస్కీమియా, శారీరక నిగ్రహం, చలి, శారీరక ఒత్తిడి నుండి అవయవాలు, కణజాలాలను రక్షించడంలో వరకు  సహాయపడుతుంది. పరగడుపు తులసి ఆకులు తింటే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం. రోగనిరోధక శక్తి: తులసి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. అందువల్ల, ఇది మీ శరీరాన్ని వివిధ ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. ఇది హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లతో పోరాడుతుంది, ఆరోగ్యకరమైన రోగనిరోధక కణాలను పెంచుతుంది. అందుకే కషాయం చేసేటప్పుడు తులసిని కలుపుతారు. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది: తులసిని క్రమం తప్పకుండా తీసుకుంటే, జీర్ణక్రియను సులభతరం చేసి... ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది. ఇది యాసిడ్ రిఫ్లక్స్‌లను బ్యాలెన్స్ చేస్తుంది. మీరు ఆరోగ్యకరమైన జీర్ణక్రియను కలిగి ఉండటానికి pH స్థాయిని నిర్వహిస్తుంది. ఇలా రెండు తులసి ఆకులను నోటిలో వేసుకుని నములుతే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నోటి దుర్వాసనకు చెక్: చాలా మంది నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతుంటారు. ఎవరితో అయినా దగ్గరగా మాట్లాడాలంటే జంకుతుంటారు. అలాంటి సమస్య ఎదుర్కొంటున్నవాళ్లు..ప్రతిరోజూ ఉదయం రెండు తులసి ఆకులను నమలడం అలవాటు చేసుకోవాలి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. రిఫ్రెష్‌గా ఉండటానికి ఉదయాన్నే వీటిని తినండి. ఒత్తిడిని దూరం చేస్తుంది: తులసి ఆకులలో అడాప్టోజెన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరంలో ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది మీ నాడీ వ్యవస్థను విశ్రాంతి తీసుకోవడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది ఇంద్రియాలను ప్రశాంతపరుచడంతోపాటు...ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మీ చర్మాన్ని మెరుగుపరుస్తుంది: మీరు ఖాళీ కడుపుతో తులసిని తీసుకుంటే, అది మీ రక్తం నుండి ట్యాక్సిన్లను  బయటకు పంపుతుంది.  ఇది మొటిమలు, మచ్చలను తగ్గించి మచ్చలు లేని చర్మాన్ని ఇస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మీ చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది: తులసిని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ విడుదల పెరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. తులసిలో ఉండే కార్బోహైడ్రేట్లు  జీవక్రియను సులభతరం చేస్తాయి.  తులసి దాని యాంటీమైక్రోబయల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఉదయాన్నే తీసుకుంటే, జలుబును  నయం చేస్తుంది.
Publish Date: Mar 16, 2024 10:30AM

ఈ గడ్డి రసం రోజూ తాగితే..

ఆరోగ్యంగా ఉంటే ఎలాంటి జబ్బులు దరిచేరవు అంటూ పరిశోధకులు, ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్తున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా ప్రజల్లో ఆరోగ్యం పై మరింత శ్రద్ధ పెరిగింది. మరి ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహారాలు రోజూ తప్పనిసరిగా తీసుకోవాలి. వాటిలో ముఖ్యమైనది గోధుమగడ్డి.   ఇంటిల్లిపాదికి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చేది గోధుమ గడ్డి. గోధుమగడ్డి జ్యూస్ రోజూ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది రక్తహీనతను చాలా వేగంగా తగ్గిస్తుంది. అంతే కాదు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే అద్భుతమైన గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. అందుకే దీన్ని గ్రీన్ బ్లడ్ అని కూడా పిలుస్తారు. గింజల్లో కన్నా మొలకెత్తిన గింజల్లో పోషకాలు ఎలా ఎక్కువ శాతంలో ఉంటాయో అదే విధంగా  గోధుమ గడ్డిలో మిగతావాటి కంటే చాలా రెట్లు ఎక్కువగా పోషకాలు ఉంటాయి. వెజిటబుల్ సూప్ లో కన్నా గ్రీన్ గోధుమ గడ్డి రసంలో రక్తవృద్ధికి తోడ్పడే పోషకాలు 8-9 రెట్లు ఎక్కువగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.   గోధుమ గడ్డిని ఇంట్లో పండించుకోవడం చాలా సులభం. అందుకు కావాల్సింది కొబ్బరి పొట్టు, వర్మికంపోస్ట్ లేదా కొద్దిగా మట్టి కంపోస్టు, కలిపిన మిశ్రమం. మూడు నాలుగు అంగుళాల లోతు ఉన్న చిన్న ప్లాస్టిక్ గిన్నెలు, డబ్బాలు, ట్రేల్లోనూ పెంచుకోవచ్చు. వారం పది రోజుల్లో గోధుమగడ్డి కావలసిన ఎత్తు పెరిగి జ్యూస్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. రోజూ వరుసగా ఒక్కొక్క ట్రేలో గోధుమ గింజలు చల్లుతూ ఉంటే పది రోజుల తర్వాత రోజూ గోధుమ గడ్డి కోతకు వస్తుంది. గింజలు రాత్రంతా నానబెట్టి తేమ ఆరిపోకుండా ఉండేలా అవసరం మేరకు నీళ్లు చిలకరిస్తే చాలు. ఇంకో విషయం ఏంటంటే గోధుమ గడ్డికి  ఎండ అసలు తగలకూడదు. నీడలోనే పెంచుకోవచ్చు. ఐదు లేదా ఆరు అంగుళాల ఎత్తు పెరిగిన గోధుమగడ్డి ని కత్తిరించి మిక్సీలో వేసి రసం తీసి తాగాలి. అన్ని వయసుల వారు దీన్ని తాగొచ్చు.
Publish Date: Mar 15, 2024 9:37PM

ఎగ్ వైట్ మాత్రమే తినే అలవాటుందా? ఈ నిజాలు తెలుసుకోవాల్సిందే..!

పోషకాహారంలో గుడ్లకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.  పిల్లలకు ఓ నిర్ణీత వయసు వచ్చినప్పటి నుండి గుడ్డును ఆహారంలో ఇవ్వడం చాలామంచిదని ఆహార నిపుణులు చెబుతారు. ఇక వయసులో ఉన్నవారికి, గర్భవతులకు, మధ్యవయసు వారికి, వృద్దులకు ఇలా.. అన్ని వయసుల వారికి శరీరానికి తగినంత పోషకాలు భర్తీ చేయడంలో గుడ్లు ఎప్పుడూ ముందుంటాయి. అయితే డైటింగ్ చేసేవారు, రెగ్యులర్ గా గుడ్డు తినేవారిలో చాలామంది కేవలం ఎగ్ వైట్స్ మాత్రమే తిని పచ్చసొన వదిలేస్తుంటారు. పచ్చసొనలో కొవ్వులు ఎక్కువ ఉంటాయని, అది ఆరోగ్యానికి మంచిది కాదనే అపోహ కూడా ఉంది. కానీ  గుడ్డులో పచ్చసొన పడేసేవారు తప్పనిసరిగా ఈ కింది విషయాలు తెలుసుకోవాలి. విటమిన్ ఎ.. గుడ్డు పచ్చసొనలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటిచూపుకు,  రోగనిరోధక పనితీరుకు,  చర్మ ఆరోగ్యానికి అవసరమైన పోషకం. శరీర సహజ రక్షణ వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో విటమిన్ ఎ కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన చర్మ కణజాలాల నిర్వహణలో సహాయపడుతుంది.  తక్కువ కాంతి ఉన్న వాతావరణ పరిస్థితులలో కూడా కంటిచూపు మెరుగ్గా ఉండేలా చేస్తుంది. విటమిన్ డి.. గుడ్డు పచ్చసొనలో కనిపించే మరో ముఖ్యమైన విటమిన్ విటమిన్ డి. దీనిని తరచుగా "సన్‌షైన్ విటమిన్" అని పిలుస్తారు. బలమైన ఎముకలు, ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థ,  సాధారణ ఆరోగ్యం  కోసం విటమిన్ డి అవసరం. కాల్షియం శోషణ,  ఎముక ఖనిజీకరణకు విటమిన్ డి తగినంత స్థాయిలో అవసరం. ఇది బలమైన,  ఆరోగ్యకరమైన ఎముకలను నిర్వహించడానికి కీలకమైనది. విటమిన్ ఇ.. గుడ్డు సొనలో విటమిన్ ఇ  పుష్కలంగా ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. రోగనిరోధక పనితీరు, చర్మ ఆరోగ్యం,  మొత్తం సెల్యులార్ ఆరోగ్యానికి సపోర్ట్  ఇవ్వడంలో విటమిన్ E కీలక పాత్ర పోషిస్తుంది.   విటమిన్ B12.. విటమిన్ B12 శక్తి ఉత్పత్తికి, నరాల పనితీరుకు,  ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు కీలకం. విటమిన్ B12 లభించే  కొన్ని ఆహార వనరులలో గుడ్డు పచ్చసొన  ఒకటి.ప్రత్యేకించి శాఖాహారం లేదా శాకాహారి ఆహారాలను అనుసరించే వారికి మొక్కల ఆధారిత మూలాల నుండి తగినంత B12 పొందడానికి కష్టంగా ఉంటుంది. విటమిన్ K.. గుడ్డు సొనలో విటమిన్ కె ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టడానికి, ఎముకల ఆరోగ్యానికి,  గుండె ఆరోగ్యానికి అవసరం. రక్తం సరిగ్గా గడ్డకట్టేలా చేయడంలో విటమిన్ K కీలక పాత్ర పోషిస్తుంది. గాయం అయినప్పుడు అధిక రక్తస్రావం జరగకుండా చేస్తుంది. అదనంగా, విటమిన్ K ఎముక జీవక్రియలో పాల్గొంటుంది. బలమైన,  ఆరోగ్యకరమైన ఎముకలను నిర్వహించడానికి సహాయపడుతుంది. విటమిన్ B2.. రిబోఫ్లావిన్ లేదా విటమిన్ B2, శక్తి ఉత్పత్తి, జీవక్రియ,  ఆరోగ్యకరమైన చర్మం,  కళ్ళ నిర్వహణలో కీలకంగా ఉంటుంది.  గుడ్డు సొనలో రిబోఫ్లావిన్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ B9.. ఫోలేట్ నే విటమిన్ B9 అని కూడా పిలుస్తారు. DNA సంశ్లేషణ, కణ విభజన,  ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు అవసరం. పిండం అభివృద్ధికి,  న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారించడానికి గర్భధారణ సమయంలో తగినంత ఫోలేట్ తీసుకోవడం చాలా ముఖ్యం.                                   *నిశ్శబ్ద.
Publish Date: Mar 14, 2024 12:28PM

ఉల్లి తో ఇన్ని లాభాలా?

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్న నానుడి ఎలా వచ్చిందో తేలియదు గాని ఉల్లి వల్ల ఆరోగ్య లాభాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. ఉల్లి కేవలం ఆహారంలో భాగం మాత్రమే కాదు పోష కలా భాలు ఉన్నాయి . అంటున్నారు నిపుణులు. ఉల్లి కేవలం ఆహారం లో భాగం మాత్రమే కాదు సంపూర్ణ పోషకాలు ఉన్నాయని అంటున్నారు. వితమిన్ సి...ఉల్లి అందరూ అంగీకరించినట్లుగా ఇది మంచి పోశాకమని శరీరానికి అవసరమైన విటమిన్ సి అందిస్తుందని తద్వారా మనం ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు. శరీరంలోని రక్త నాళాల ఇతర భాగాలాకు సరిగా పనిచేసేవిధంగా చేస్తుంది. యాంటి ఆక్సిడెంట్ పని చేస్తుంది. రాడికల్స్ పై పోరాడే గుణం ఉల్లికిఉంది ఏ మాలిక్యుల్స్ అయితే కొన్ని సార్లు నాశనం చేస్తాయో అప్పుడు నిపుణులు విటమిన్ సి మిల్లి గ్రాములలో సూచిస్తారు. అది ప్రతిరోజు తీసుకోవచ్చు. ఒక్క ఉల్లి పాయలో 1% నుండి 18 % వరకు ఉంటుంది. పీచు పదార్థము...ఉల్లిపాయలో రెండు రకాల పీచు పదార్దాలు ఉంటాయి. డై టెరీ ఫ్రీ బయోటిక్ ఒక కప్పులో 12% 2 1 నుంచి 38 గ్రా మీకు రోజూ అవసరం. అవుతుంది.పీచు పదార్ధం శరీరంలో ప్రతిరోజూ బౌల్ కదలికలు ఉండడం అవసరం. మీకు కడుపు నిండి నప్పుడు చాలా తక్కువగా తింటారు. అప్పుడు మీకు ఊబ కాయం తగ్గుతుంది. ఉల్లిలో ఫ్రీ బయోటిక్ మీ గత ను బ్యాక్టీరియా ను కలిగిఉంటుంది.యాంటి ఆక్సిడెంట్...అన్ని ఉల్లిపాయాలలో క్వార్ స్టాన్ ఫ్లావోనాయిడ్స్ లేదా యాంటి ఆక్సిడెంట్ కాంపౌండ్ క్వార్టిన్ లో యాంటి ఇంఫ్లామేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. అవి శరీరానికి సహకరిస్తాయి. విటమిన్ ఇ సంరక్షిస్తుంది. క్యాన్సర్ ప్రతి ఉల్లి పాయనుంచి ఆక్సిడెంట్ ఎరుపు,పసుపు తెల్ల ఉల్లిపాయాలలో పూర్తి పోషకాలు ఉంటాయని అంటున్నారు. విటమిన్ బి 6 ఒక మీడియం ఉల్లిపాయాలో 8% ప్రతిరోజూ విటమిన్ బి6 శరీరానికి సహకరిస్తుంది. ఉల్లి తీసుకోవడం వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాల వృద్ది ప్రోటీన్ నిరోదిస్తుంది. ఉదయం సాయంత్రం వేళ లో స్త్రీలు ఎదుర్కొనే సిక్ నెస్ నుండి బయట పడడానికి సహకరిస్తుంది. పచ్చి ఉల్లిపాయా ఆరోగ్యకరం... పచ్చి ఉల్లిపాయ ను తినడం వల్ల లాభాలు ఉన్నాయి. సలాడ్ లో ఆమ్లెట్ లేదా సాంద్ విచ్ లో గుండ్రంగా కోసిన ఉల్లిపాయాలు చాలా నెమ్మదిగా కొరికి తినడం వల్ల మంచి పీచు పదార్ధము ఉంటుంది. వండినా లేదా  వేయించిన ఉల్లిపాయాలు చెడుపు చేస్తాయి. అందులో పోషకాలు ఉండవని అంటున్నారు నిపుణులు. ఎర్ర ఉల్లి పచ్చడి... సన్నగా కోసిన ఎర్ర ఉల్లి పాయాను రెడ్ వైన్ లో లేదా వెనిగర్ లో కొంచం ఉప్పువేసి 15 ని మిషాలు ఉంచి ప్రతి 5 నిమిషాలు కట్ చేయండి. బర్గర్స్ లో సలాడ్స్ లో కొన్ని కొన్ని ఆహారాలలో ముఖ్యంగా బకింగ్ ఐటమ్స్ లో బాగుంటాయి. మీకిష్టమైన వాటితో ఫిల్ చెయ్యండి... సన్నగా తరిగిన ఉల్లిపాయలు. వాటిపై కొంచం మిరియాల పొడి మీకు నచ్చిన ప్రోటీన్ ఆయిల్ కొంచం సోడియం సోయా, బ్రౌన్ రైస్ సల్సా సోర్ కరీం బోనస్ గా పచ్చి ఉల్లిపాయాని గ్యుకమోల్ తో కలిపి తింటే ఆ రుచివేరు అంటారు ఆహారా ప్రియులు.  నాన పెట్టి తినాలి... ఉల్లిపాయా కోసినప్పుడు కంటినుంచి నీటిని తెప్పిస్తుంది. అది పచ్చి ఉల్లిపాయ కోసినప్పుడు చాలా ఘాటుగా అనిపిస్తుంది.వాటిని సనాగా కోసి చల్లని నీటిలో చల్లని ప్రదేశంలో 3౦ నిమిషాలు ఉంచండి వాటి ఘాటు పవర్ తగ్గి దానిఅసలు మూలం పోకుండా ఉంటుంది. ఉల్లిని ఎలా నిల్వచేయాలి... మీరు మీ ఇంట్లో ఉల్లిని నిల్వ చేసినప్పుడు చల్లటి ప్రదేశంలో ఉంచండి. కాస్తగాలి ఉండే ప్రదేశంలో ఉల్లిని నిల్వ ఉంచండి.ఒకాసారి కోసిన చీల్చిన వాటిని మాత్రమే ఫ్రిజ్ లో ఉంచండి 7 నుండి 1౦ రోజులు ఆలు కు దూరంగా ఉంచండి. అన్నిటికన్నా ప్రసస్తంగా ఉండాలంటే పురుషుల లో సామార్ధ్య్సాన్ని పెంచేది ఈ ఉల్లే. కాబట్టి అన్నిరాకల ఆరోగ్య విలువలు ఉన్న ఉల్లి సర్వాత్రా మేలు చేస్తుందనేది నిపుణులు చెపుతున్న మాట.  
Publish Date: Mar 13, 2024 6:30PM

మనం ఎంతో ఆరోగ్యం అనుకునే ఈ ఆహారాలు ఎంత డేంజరంటే..!

  ఆరోగ్యంగా ఉండటానికి తరచుగా ఆరోగ్యకరమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి ఉండాలని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు అందరూ చెప్తారు.  సాధారణంగా  ఆరోగ్యం మెరుగ్గా ఉన్న ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాలు, పానీయాలను తప్పనిసరిగా తమ ఫుడ్ మెనూలో చేర్చుకుంటారు.  అయితే చాలా మంది రోజూ తింటున్న కొన్ని ఆహారాలు శరీరానికి ఎంతో మంచిదనే భ్రమలో ఉన్నారు. కానీ నిజం చెప్పాలంటే ఇలా తీసుకుంటున్న కొన్ని ఆహారాలు  ఆరోగ్యానికి మంచి చేయకపోగా చెడు చేస్తయని ఆహార నిపుణులు అంటున్నారు.  అందరూ ఆరోగ్యం అనుకుంటున్న ఏ ఏ ఆహారాలు ఆరోగ్యానికి చేటు చేస్తాయో.. అసలవి ఎందుకు మంచివి కాదో తెలుసుకుంటే.. డైజెస్టీవ్ బిస్కెట్స్.. డైజెస్టివ్ అనే పేరును బట్టి ఈ బిస్కెట్లు చాలా ఆరోగ్యకరం అని అనుకుంటారు. చాలా మంది ఆకలిగా అనిపించినప్పుడు, అల్పాహారంలోనూ  ఈ బిస్కెట్లకు ప్రాధాన్యత ఇస్తుంటారు. నిజానికి డైజెస్టివ్ బిస్కెట్లు పిండి, చక్కెరతో నిండి ఉంటాయి. వీటిలో చాలా కేలరీలు ఉంటాయి. వీటిని రోజూ తీసుకుంటే, బరువు చాలా సులభంగా పెరుగుతారు.  ఖఖ్రా.. ఈ రోజుల్లో డైట్ ఖఖ్రా మార్కెట్లో విరివిగా అందుబాటులో ఉంది. చాలామంది సాయంత్రం టీతో పాటు వీటిని  చాలా ఉత్సాహంగా తింటారు. అయితే డైట్ ఖఖ్రాలో 'డైట్' లాంటిది ఏమీ ఉండదనేది విస్తుపోవాల్సిన విషయం. ఈ వేయించిన స్నాక్స్ లో చాలా కేలరీలు ఉంటాయి. హెల్త్ డ్రింక్స్.. ఇప్పట్లో హెల్త్ డ్రింక్స్  చాలా విరివిగా ఉపయోగిస్తున్నారు. పిల్లలకు ఈ హెల్త్ డ్రింక్స్ వాడకం మరీ ఎక్కువ ఉంటోంది.  ఎందుకంటే పిల్లలకు పాలు ఇవ్వాలంటే ఈ హెల్త్ డ్రింక్స్  పౌడర్లు ఉండాల్సిందే.  అయితే కంపెనీలు పేర్కొన్నట్టు విటమిన్లు, DHA కలిగిన ఈ హెల్త్ డ్రింక్స్ పౌడర్లు చాలా అనారోగ్యకరమైనవి.  వీటిలో చక్కెర శాతం ఎక్కువ ఉంటుంది. వీట్ బ్రెడ్.. వైట్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్, లేదా గోధుమ బ్రెడ్  ఆరోగ్యకరమైనదని చాలా మంది అనుకుంటారు. అయితే ఈ బ్రౌన్ బ్రెడ్ కూడా వైట్ బ్రెడ్ లాగా అనారోగ్యకరమైనది.  ఎందుకంటే ఇందులో రంగులు ఉపయోగించబడతాయి,  దీని తయారీలో ఆరోగ్యకరమైన పదార్థాలేవీ ఉపయోగించరు.                                 *నిశ్శబ్ద.  
Publish Date: Mar 12, 2024 12:32PM