బుద్దగయ తరువాత ముంబై

 

శాంతి కాముకుడు బుద్దుడి సాక్షిగా జరిగిన పేళ్లుల తరువాత నెక్ట్స్‌ ఉగ్రవాదుల టార్గెట్‌ ఏంటి ఇప్పుడు అందరి మదిలో ఇదే ప్రశ్న.. అయితే బుద్దగయలో జరిగిన పేళ్లులకు బాధ్యత వహిస్తున్నట్టుగా భావిస్తున్న ఇండియన్‌ ముజాహిదిన్‌ తమ నెక్ట్స్‌ టార్గెట్‌ను ప్రకటించింది.

భౌధ్ద సన్యాసులకు, ఆలయాలకు ఆలవాలమైన బుద్దగయలో పేళ్లులు జరిగిన కాసేపటికే ఆ బ్లాస్ట్‌లకు బాధ్యత వహిస్తూ ఇండియన్‌ ముజాహిదిన్‌ ట్విటర్‌లో ఓ ప్రకటనచేసింది.. అంతేకాదు తామ నెక్ట్స్‌ టార్గెట్‌ ఇండియా ఫైనాన్షియల్‌ క్యాపిటల్‌ ముంబై అంటూ ప్రకటించింది.

అయితే బుద్దగయలో పేళ్లులు జరగటానికి కొన్ని గంటలకు ముందే ఈ ట్వీట్‌ రావడంతో పోలీస్‌లు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు.. ఇప్పటికే ఆ ట్విటర్‌ ఎకౌంట్‌కి సంభందించిన సమాచారాన్ని సేకరిస్తున్న ఎన్‌ ఐ ఎ.. ఆ ఎకౌంట్‌ కెనడాలో క్రియేట్‌ చేసినట్టుగా గుర్తించారు..

ఉగ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు తగిన జాగ్రత్తలు చేపడుతున్నారు..