Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నిర్దోషిగా నిరూపించుకుంటా: ధర్మాన
posted on: May 20, 2013 6:40PM

కాంగ్రెప్ పార్టీ అధిష్టానం ఆదేశాలను గౌరవిస్తానని, పార్టీకి సేవ చేస్తానని ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. చార్జీషీటులో పేరు ఉన్నంత మాత్రాన దోషులం కాదని,న్యాయవిచారణలో అన్ని నిజాలు బయటకు వస్తాయని అన్నారు. దర్యాప్తు సంస్థలు పేరు నమోదు చేసినప్పుడే తాను మంత్రి పదవికి రాజీనామా చేశానని ధర్మాన చెప్పారు. పార్టీకి ప్రభుత్వానికి ఇబ్బంది ఉండకూడదని తాను రాజీనామా చేశారని, అప్పటి రాజీనామాకే కట్టుబడి ఉన్నానని ధర్మాన తెలిపారు. భూ కేటాయింపుల విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోలేదని, మంత్రివర్గానికి తెలిసే అన్ని నిర్ణయాలు జరిగాయని దర్మాన పేర్కొన్నారు. తమకు న్యాయవ్యావస్థపై నమ్మకం ఉందని, త్వరలోనే నిర్దోషులగా బయటకు వస్తామని ధర్మాన ప్రసాదరావు ఆశాభావం వ్యక్తం చేశారు.


.jpg)


