తెలంగాణ బిల్లు 'టైమ్' ఇదికాదు

 

 

 

లోక్ సభలో తెలంగాణ బిల్లు పెట్టేందుకు ఇది సరైన సమయం కాదని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్‌కె అద్వానీ అన్నారు. గందరగోళ పరిస్థితుల మధ్య సభలో బిల్లు పెట్టడం దురదృష్టకరమని... సభలో ఓటాన్ అకౌంట్ తప్ప మరేబిల్లు చేపట్టేందుకు సాధ్యం కాదని అన్నారు. కాంగ్రెస్ నేతలే హింసను సృష్టించారని, ఈరోజు జరిగిన సంఘటనలు పార్లమెంట్ చరిత్రకే చెరగని మచ్చని అద్వానీ అవేధన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ముందే కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు బిల్లు ప్రతులను చింపి గాలిలోకి విసిరేయడం, సభా ఆస్తులను ధ్వంసం చేయడం చాలా బాధకరమని ఆయన అన్నారు. ఇంత వివాదాస్పదమైన బిల్లు సమస్య కేవలం కాంగ్రెస్ ఎంపీలను, మంత్రులను సస్పెండ్ చేసినంత మాత్రాన పరిష్కారం కాదని ..అందుకు తాము అ౦గీకరించబోమని స్పష్టం చేశారు.