తుపాను బాధితులకు టిడిపి నేతల విరాళం

 

తుపాను బాధితుల సహాయం కోసం ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి తూర్పుగోదావరి జిల్లా చెందిన టీడీపీ నాయకులు విరాళం ప్రకటించారు. ముమ్మిడివరం నియోజవర్గానికి చెందిన నేతలు రూ.10లక్షల విరాళాన్ని అందజేయనున్నట్టు తెలిపారు. టీడీపీ ఎస్సీ విభాగం సీఎం సహాయనిధికి రూ.11లక్షలు విరాళం ప్రకటించింది.

ఏపీ ఎన్జీవోలు రెండు రోజుల సాలరీని హుదూద్ బాధితులకు సహాయంగా ఇచ్చారు. ఈమేరకు ఏపిఎన్జీవో సంఘం నేత అశోక్ బాబు, చంద్రబాబును కలిసి చెక్ ను అందచేశారు. ఈ సందర్భంగా విరాళం ఇచ్చిన ఏపీఎన్జీఓ ఉద్యోగులకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. హుదుద్ తుపాను చర్యలపై రెండు రివ్యూలు, ఐదు కాన్ఫరెన్సులు నిర్వహించాల్సి ఉందని చంద్రబాబు వెల్లడించారు.