అధికారాంతంలో సోనియా, మన్మోహన్!

 

 

 

సోనియాగాంధీ అధికారం ముగుస్తోంది. దీనితోపాటు యుపిఏ ప్రభుత్వం అధికారం కూడా ముగిసిపోనుంది. పదేళ్ళపాటు దేశానికి పట్టిన దరిద్రం వదిలిపోవడానికి ఇంకా కొద్ది రోజులే మిగిలి వుంది. ఇప్పుడు అధికారాంతంలో వున్న సోనియా, మన్మోహన్ మంగళవారం నాడు చిట్టచివరి అధికారిక సమావేశంలో పాల్గొన్నారు. ఏర్పాటైన జాతీయ సలహా మండలి (ఎన్ఏసీ) ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో సోనియా, మన్మోహన్ సింగ్ పాల్గొన్నారు. వీరిద్దరికీ ఇది చివరి అధికారిక సమావేశం. ఈ సందర్భంగా సోనియా, మన్మోహన్ మాట్లాడుతూ యుపిఎ ప్రభుత్వం సహకారం కారణంగానే జాతీయ సలహామండలి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలిగిందని తమని తాను పొగుడుకున్నారు.