అత్యాచారానికి మరో పసిపాప బలి

posted on: Mar 13, 2013 8:54AM

కడపజిల్లా చెన్నూరు మండలంలోని శివాలపల్లె ఆర్ ఆర్ పాఠాశాలలో 1వ తరగతి చదువుతున్న గుత్తా మానస అనే 7 సంవత్సరాల పాపను అదే పాఠాశాలలో చదువుతున్న బాలుడు పాపకు మాయమాటలు చెప్పి మంగళవారం సాయంత్రం పెన్నానది ఒడ్డుకు తీసుకువెళ్ళాడు. ఆ సమయంలో అక్కడకి చేరుకున్న మరో నలుగురు యువకులు బాలికపై అత్యాచారం చేసి బాలికను చంపి పెన్నానదిలో పడేశారు. స్కూలు సమయం అయిపోయినా పాప ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రాత్రి పదిన్నరకు నది పక్కనే ఉన్న ముళ్ళపొదలో బాలిక శవం కనిపించింది. పోలీసులు నంద్యాల వెంకట శివను ప్రశ్నించగా తనకు ఏమీ తెలీదని ఆటోడ్రైవర్ నంద్యాల శ్రావణ్ పాపను తీసుకుని రమ్మని చెప్పగా తాను పాపను తీసుకుని వెళ్లానని తెలిపాడు. పోలీసులు నంద్యాల శ్రావణ్, శివశంకర్ లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు

google-ad-img
    Related Sigment News
    • Loading...