కొట్టుకు చస్తున్నారు!

 

 

 

టీఆర్ఎస్ నాయకులు ఇతర పార్టీల నాయకుల మీద మాటలతో దాడులు చేస్తుంటే, ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్ నాయకుల మీద కత్తులతో దాడులు చేస్తున్నారు. గద్వాల మండలం అనంతపురం గ్రామం నుంచి ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జలీల్ మీద ఆయన రాజకీయ ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి నరికారు. జలీల్‌ని ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమించిందని వైద్యులు అంటున్నారు. ఇదిలా వుంటే, కర్నూలు జిల్లా డోన్ మండలం వికట నాయిని పల్లిలో కాంగ్రెస్ - టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కర్రలు, కత్తులతో రెండు పార్టీలకు చెందిన నాయకులు విచ్చలవిడిగా కొట్టుకుని, పొడుచుకున్నారు. పదిమంది వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. టీడీపీ నాయకుల వాహనం ధ్వంసమైంది.