జొమాటో సీఈఓ సారీ.. ఎందుకో తెలుసా.. 

జొమాటో సీఈఓ సారీ.. ఎందుకో తెలుసా.. 

ఎంత గొప్పవాళ్ళైనా అయినా. కొన్నీసార్లు పరపాట్లు  తప్పవు.. ఎంతటివారైనా అప్పుడప్పుడు పప్పులో కాలు వేస్తుంటారు. అందుకు నేను కూడా తక్కువేం కాదు అంటున్నాడుజొమాటో సీఈఓ . తాజాగా ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ పొరపడి పెట్టిన ట్వీట్‌ తర్వాత ఆ తప్పు క్షమాపణలు వరకు వెళ్ళింది. తన పోస్ట్ పై ముంబయి పోలీసులు స్పష్టత ఇచ్చారు. 

మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కారణంగా ఇటీవల అక్కడి ప్రభుత్వం రాత్రి ఎనిమిది నుంచి లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలను విధించింది. అత్యవసర సేవలకు మాత్రం అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలోనే దీపిందర్ ట్వీట్ చేశారు.   ‘ముంబైలో రాత్రి ఎనిమిది తరవాత అవసరమైన ఫుడ్ డెలివరీ చేయడానికి జొమాటో సిద్ధం. అయితే మేం చట్టానికి కట్టుబడి ఉంటున్నాం. కానీ పోటీ సంస్థ రాత్రి ఎనిమిది తరవాత కార్యకలాపాలను నిర్వహిస్తోంది. దీనిపై ముందుకెళ్లే మార్గాన్ని స్పష్టం చేయమని ముంబయి పోలీసుల్ని కోరుతున్నాను’ అంటూ దీపిందర్‌ స్విగ్గీ హోం పేజీని షేర్ చేశారు.  

ఆయన చేసిన కామెంట్ కి  ముంబయి పోలీసులు వెంటనే స్పందించారు. ‘ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఒకసారి గమనించండి. వాటిలో హోం డెలివరీకి అనుమతించింది. ఎక్కడ కూడా కాలపరిమితి విధించలేదు’ అని జవాబిచ్చారు. దీనిపై ముంబయి పోలీసులకు దీపిందర్ కృతజ్ఞతలు చెప్పారు. అలాగే స్విగ్గీని ట్యాగ్ చేసి..‘క్షమాపణలు, మాకు మరో అవకాశం లేదు’ అంటూ వ్యాఖ్యను జోడించారు. అయితే జొమాటో సీఈఓ వైఖరిని మాత్రం నెటిజన్లు తప్పు పడుతున్నారు.