రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు

 

 

 

వైఎస్ జగన్‌కి, ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలకి భవిష్యత్తులో రెచ్చిపోయే అవకాశాలు కనిపిచండం లేదు కాబట్టి ఈ ఎన్నికలలో రెచ్చిపోతున్నారు. సీమాంధ్రలో పోలింగ్ సందర్భంగా వైకాపా నాయకులు పూర్తిగా తెగించేశారు. ఎంతటి దారుణానికైనా వెనుదీయని విధంగా ప్రవర్తిస్తున్నారు. శాంపిల్‌గా కడప జిల్లాని తీసుకుంటే వైకాపా కార్యకర్తలు వీరంగం ‌సృష్టిస్తునారు. చాలా పోలింగ్ బూత్‌‌ల్ని ఆక్రమించి రిగ్గింగ్ చేస్తున్నారు. ఇతర పార్టీలకు చెందిన పోలింగ్ ఏజెంట్లను చాలాచోట్ల బయటకి తరిమికొట్టారు. కొన్నిచోట్ల క్యూలలో నిల్చున్న ఓటర్లని, ఓటు వేయబోతున్న ఓటర్లని కూడా ప్రభావితం చేస్తున్నారు.


సీమాంధ్ర వ్యాప్తంగా వైకాపా కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. కొన్ని ప్రాంతాలలో పోలీసులు గాలిలోకి కాల్పులు జరగడానికి కారణమయ్యారు. వైకాపా కార్యకర్తలు కొన్నిచోట్ల మీడియావాళ్ళని చావబాదారు. ఒకచోట అయితే ఎన్నికల అధికారినే కొట్టారు. పోలింగ్ రోజున కూడా డబ్బు, మద్యం పంపిణీని యథేచ్ఛగా చేస్తున్నారు. వైకాపా అభ్యర్థులు ప్రధానంగా టీడీపీ కార్యకర్తలు, టీడీపీ పోలింగ్ ఏజెంట్లను టార్గెట్ చేసుకుని వారిమీద దాడులు చేస్తు్న్నారు. ఇతర పార్టీల పోలింగ్ ఏజెంట్లను కూడా మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పోలింగ్ మొదలైన రెండు మూడు గంటల్లోనే వైకాపా శ్రేణులు ఇన్ని లీలలు ప్రదర్శించాయి. పోలింగ్ ముగిసే వరకూ ఇంకెన్ని లీలలు చూసి తరిస్తామో ఏంటో..