వైరల్.. జగన్ ని ఇరుకున పెడుతున్న ఫోటో.!!

 

ప్రతిపక్షాలు అధికార పార్టీ మీద విమర్శలు చేయడం కామన్.. ఈ విషయంలో ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ ముందు వరుసలో ఉంటుంది.. అవకాశం దొరికినప్పుడల్లా వైసీపీ నేతలు అధికార పార్టీ టీడీపీ మీద ఆరోపణలు, విమర్శలు చేస్తూనే ఉంటారు.. టీడీపీ ఏవైనా పథకాలు ప్రవేశ పెట్టినప్పుడు కూడా ఆ పథకాల్లో అవినీతి తప్ప, ప్రజలకు మేలు జరగదు అంటూ విమర్శిస్తూ ఉంటారు.. టీడీపీ ప్రభుత్వం ఆ మధ్య స్టార్ట్ చేసిన అన్న క్యాంటీన్ల విషయంలో కూడా వైసీపీ నేతలు విమర్శలు చేసారు.. అయితే ఇప్పుడు అదే అన్న క్యాంటీన్ లోని ఒక ఫోటో వైసీపీని ఇరుకున పెడుతోంది.. ప్రస్తుతం జగన్ పాదయాత్ర విశాఖపట్టణంలో జరుగుతుండగా.. ఆ పాదయాత్రలో పాల్గొన్న పలువురు వైసీపీ అభిమానులు, కార్యకర్తలు మధ్యాహ్న వేళ భోజనానికి అన్న క్యాంటీన్లకు వెళ్లడం జరిగింది.. వైసీపీ కార్యకర్తలు అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. 'అన్న క్యాంటీన్లను విమర్శించారు.. ఇప్పుడు అవే అన్న క్యాంటీన్లు అలసిపోయిన మీ కార్యకర్తల కడుపు నింపుతున్నాయి' అంటూ టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.