నారాయణకు సమైక్య అడ్డు

 

సోమవారం అనంతపురం వచ్చిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణకు సమైక్యాంద్ర కార్యకర్తల నిరసన అడ్డుపడింది. నారాయణని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకుని, జై సమైక్యాంద్ర అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. దీంతో ఇరు పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి, ఇరువర్గాల వారిని శాంతిపచేసారు.