రాయపాటిపై జగన్ పార్టీ కార్యకర్తల దాడి
posted on May 7, 2014 3:19PM
ఓటమి భయం పట్టుకున్న వైసీపీ నాయకులు సీమాంధ్రలో పోలింగ్ సందర్భంగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపై దాడులు ముమ్మరం చేశారు. అవకాశం దొరికితేచాలు తెలుగుదేశం వారిమీద దాడి చేశారు. ఈ దాడుల మీద సీమాంధ్రలో దాదాపు రెండు వందలకు పైగా కేసులు వైసీపీ నాయకుల మీద నమోదయ్యాయి. వైసీపీ నాయకులు ఎన్నికల సిబ్బంది మీద కూడా దాడిచేసిన ఘనతను తమ ఖాతాలో జమచేసుకున్నారు. ఇప్పుడు జగన్ పార్టీ నాయకులు నరసరావు పేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో వున్న ఎంపీ రాయపాటి సాంబశివరావు మీద నరసరావుపేటలో దాడి చేశారు. దాదాపు పదిమంది వైకాపా కార్యకర్తలు రాయపాటి కారు మీద రాళ్ళతో దాడి చేశారు. వీళ్ళు రాయపాటి కారును ధ్వంసం చేశారు. సమయానికి తెలుగుదేశం కార్యకర్తలు రాయపాటిని కాపాడారు. వైకాపా కార్యకర్తలు దాడి చేసిన సమయంలో అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు లేకపోతే రాయపాటి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.