ఓటర్లని రాళ్ళతో కొట్టారు

 

 

 

మే, 7, 2014వ తేదీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘వీరబాదుడు దినోత్సవం’గా జరుపుకుంటున్నట్టు కనిపిస్తోంది. బుధవారం ఉదయం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కంటికి కనిపించినవాళ్ళందర్నీ బాదిపారేస్తున్నారు. సీమాంధ్ర వ్యాప్తంగా అనేకమంది తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల మీద దాడి చేసిన వైపీసీ కార్యకర్తలు వాళ్ళని తలలు పగిలి రక్తం పారేట్టుగా కొట్టారు. అలాగే కొన్నిచోట్ల పోలీసులను కొట్టారు. మరికొన్ని చోట్ల మీడియా ప్రతినిధులను కొట్టారు. ఇంకొన్నిచోట్ల పోలింగ్ సిబ్బందిని బాదారు. ఇంతమందిని బాదాం.. ఇక ఓటర్లని మాత్రం వదలటం ఎందుకని అనుకన్నారేమోగానీ, ప్రకాశం జిల్లాలో బొల్లాపల్లిలో ఓటర్లను కూడా రాళ్ళతో కొట్టారు. వైసీపీ కార్యకర్తలు విసిరిన రాళ్ళు తగిలి అనేకమంది ఓటర్లకు తీవ్ర గాయాలయ్యాయి. కొందరికి కళ్ళ దగ్గర రాళ్ళు తగిలాయి.