మండలి రద్దుతో వైసీపీకే నష్టం... అయినా జగన్ డేరింగ్ స్టెప్...

శాసనమండలి రద్దుతో వైసీపీకే ఎక్కువ నష్టమని... అయినా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డేరింగ్ స్టెప్ తీసుకున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు అండ్ టీడీపీ ఎమ్మెల్సీల వ్యవహార శైలి కారణంగానే మండలి రద్దుకు ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు. ప్రజలకు మేలు చేసేందుకు ప్రభుత్వం బిల్లులు చేస్తుంటే... వాటిని టీడీపీ అడ్డుకుంటూ రాజకీయాలు చేస్తోందన్నారు. అయితే, మండలి రద్దుపై... అలాగే, తమ ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలు సరైనవో కాదో... త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే తీర్పు చెబుతారని సజ్జల అన్నారు.