తెలంగాణా ముడేసి కొండని లాగాలనిచూసిన కవిత

 

వై.యస్సార్.పార్టీ నాయకురాలు కొండాసురేఖ తన తండ్రిని ‘తెలంగాణా సాదిన్చలేకపోతే తలనరుక్కొని చస్తానన్నవాడివి, తెలంగాణా తీసుకురాకపోయినా ఇంకా ఎందుకు బ్రతికే ఉన్నావు? అని అడిగినప్పటినుండీ అయన కుమార్తె కవిత ఆమెపై కోపంతో రగిలిపోసాగింది. మళ్ళీ ఆ మర్నాడే కొండాసురేఖ తన తండ్రిని “దమ్ముంటే రా! ఇద్దరం కలిసి డిల్లీవెళ్లి సోనియాగాంధీ ఇంటిముందే పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకొని తెలంగాణా పట్ల ఎవరికెంత చిత్తశుద్ధి ఉందో నిరూపించుకొందాము,” అని మరోసారి తన తండ్రికి సవాలు విసిరినప్పటినుండీ ఆమెపై ప్రతీకారం ఎప్పుడు తీర్చుకొందామా అని తపించిపోతున్న కవితకి, వచ్చేవారం డిల్లీలో జరగనున్న అఖిలపక్ష సమావేశం ఒకమంచి అవకాశంగా భావించి, కొండాసురేఖకి ఆమె ఇప్పుడు ప్రతిసవాల్ విసిరింది.

 

“నీవు నిజమయిన తెలంగాణావాదివే అయితే నువ్వూ, నీపార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కలిసి అఖిలపక్షసమావేశానికి హాజరయి, ఒకనాడు ఏ నోటితో పార్లమెంటులో సమైక్యాంధ్ర కావాలని అడిగేడో అదే నోటితో ఇప్పుడు ఆయన చేత జై తెలంగాణా అనిపించు. మీ పార్టీకి చిత్తశుద్దిఉంటే కోర్టు అనుమతి తీసుకొని అతనిని వెంటబెట్టుకొని అఖిలపక్ష సమావేశానికి హాజరయి అసలయిన తెలంగాణావాదివని నిరూపించుకో” అని కవిత, కొండాసురేఖకు సవాల్ విసిరింది.

గానీ, మన కొండ ఇంకా కదలలేదు మెదలలేదు.