ఆయనకి ఎన్నికల కమిషన్ షాక్

 

 

 

“ఇంకా ఎన్ని రోజులురా మీ ఆగడాలు…ఈ అరాచకాలు…ఆయనొస్తున్నాడు…” అంటే... ఎవరాయన? రాజకీయ నాయకుడు ప్రశ్నిస్తే ఆయన ఎవరో కాదు వైఎస్ రాజశేఖరరెడ్డి పుత్రరత్నం జగన్ అనే విషయం రివీల్ అవుతుంది. వెంటనే ఫ్యాన్ గుర్తు కనిపిస్తుంది. ఆ తర్వాత ఓ బొంగురు గొంతు ‘ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి.. దుమ్ము దులిపేయండి’ అని సందేశం ఇస్తూ గత కొన్ని రోజులుగా టీవీలో ప్రకటనలు హడావిడి సృష్టించాయి. అయితే సడన్ గా ఛానెళ్ళలోంచి ఈ ప్రకటన మాయమై౦ది. అయితే ఈ ప్రకటనపై ఎన్నికల కమిషన్ అభ్యంతర౦ పెట్టింది. తమ అనుమతి లేకుండా ప్రకటనలు ప్రసారం చేయకూడదని స్పష్టం చేసిందట. దాంతో వైఎస్సార్సీపీ ఎన్నికల కమిషన్‌కి ఈ ప్రకటనల ప్రసారం చేయడానికి అనుమతి కోరుతూ లేఖ రాసింది. అయితే ఎన్నికల కమిషన్ ఈ ప్రకటనల ప్రసారానికి అంగీకరింబోనని తెలిపిందట.