సీఎం జగన్ ఫ్రెండ్ ని బలి తీసుకున్న అభిమానం!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై తమకున్న అభిమానాన్ని చాటుకోవాలన్న తాపత్రయంతో ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన విశాఖ జిల్లాలోని అనకాపల్లిలో జరిగింది. పట్టణ పరిధిలో నివాసం ఉంటున్న ఏడిద జగదీష్ (39), ముప్పిడి శ్రీను (42) వైసీపీ అభిమానులు. జగదీష్, తన చిన్న వయసులో హైదరాబాద్ లోని పబ్లిక్ స్కూల్ లో వైఎస్ జగన్ తో కలిసి చదువుకున్నాడు. ఆ స్నేహమే పెద్దయ్యాక జగన్ మీద అభిమానంగా మారింది. అయితే ఆ అభిమానమే ఇప్పుడు ఆయనను బలి తీసుకుంది. జగన్ తో తీయించుకున్న ఫోటోలు, జగన్ పాదయాత్రలో పాల్గొన్న ఫొటోలతో కలిపి ఓ భారీ ఫ్లెక్సీని తయారు చేయించాడు. దానిని తన ఇంటి ముందు కట్టేందుకు శ్రీనుతో కలిసి జగదీష్ డాబా పైకి ఎక్కాడు. అయితే, ఆ సమయంలో గాలి అధికంగా వీచడంతో, ఫ్లెక్సీ ఒక్కసారిగా ఇంటి ముందు ఉన్న విద్యుత్ తీగలపై పడింది. దీంతో ఫ్లెక్సీని పట్టుకుని ఉన్న ఇద్దరూ షాక్ కు గురై మరణించారు.