జగన్మోహన్ రెడ్డితో కేసీఆర్ కూతురు భేటీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవిత భేటీ అయ్యింది, లోటస్ పాండ్ లోని జగన్ నివాసానికి వెళ్లిన నిజామాబాద్ ఎంపీ కవిత... జగన్ తోపాటు ఆయన సతీమణి భారతితో కూడా సమావేశమైనట్లు తెలుస్తోంది. అయితే మీడియాకి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఈ భేటీపై పలు ఊహాగానాలు చెలరేగినా, బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వానించడానికే భారతిని కలిసినట్లు తెలుస్తోంది, ప్రస్తుతం సాక్షి మీడియా గ్రూప్ బాధ్యతలు చూస్తున్న భారతిని మర్యాదపూర్వకంగానే ఆహ్వానించామని, త్వరలో అన్ని టీవీ ఛానల్స్ ను కలిసి బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనాలని కోరనున్నట్లు చెబుతున్నారు