కరోనా వేళ కానరాని మానవత్వం.. నడి రోడ్ పైనే యువకుడి మృతి

హైదరాబాద్ లోని ఈసీఐఎల్‌లో బుధవారం నాడు ఒక విషాదం చోటు చేసుకుంది. స్థానిక జవహర్ నగర్ కు చెందిన యువకుడు ఈసీఐఎల్‌ వద్ద ఉన్న ఆస్పత్రిలో కొద్దిరోజుల నుంచి చికిత్స పొందుతున్నా జ్వరం ఎంతకూ తగ్గకపోవడంతో అతడిని మరో పెద్ద హాస్పిటల్ కు తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో ఆటోలో అతడిని వేరే హాస్పిటల్ కు తీసుకెళుతున్న సమయంలో హఠాత్తుగా అతడి పరిస్థితి విషమించింది. దీంతో ఈసీఐఎల్ దగ్గర అతడిని రోడ్డుపైనే దించారు. దీంతో సాయం కోసం అతడితో వచ్చిన ఇద్దరు మహిళలు చుట్టూ పక్కల ఉన్నవారిని వేడుకున్నారు. అదే సమయంలో 108 అంబులెన్స్ ‌కోసం కొందరు ఫోన్ చేశారు. అయితే అంబులెన్స్ వచ్చేలోపు అతడు చనిపోయాడు. అయితే అతడు కరోనా కారణంగానే చనిపోయాడా లేక ఇతర అనారోగ్యంతో కన్నుమూశాడా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కరోనా విలయ తాండవం చేస్తుండటం తో పక్క వాడు చావు బతుకుల్లో ఉన్న పట్టించుకోని పరిస్థితి దాపురించింది.