దేశాన్ని కదిలించిన దిశ ఘటనపై చర్చ.. వైసీపీ ఎంపీకి జోలపాట!!

 

క్లాస్ రూమ్ లో టీచర్ పాఠాలు చెప్తుంటే కొందరు స్టూడెంట్స్ వినకుండా నిద్రపోతుంటారు. అయితే ఈ అలవాటు కొందరు పొలిటీషియన్స్ కి కూడా ఉంది. అసెంబ్లీ, పార్లమెంట్ సాక్షిగా ప్రజా సమస్యల గురించి చర్చించాల్సింది పోయి.. ఆ చర్చలనే జోల పాటలా ఫీలయ్యి నిద్రపోతుంటారు కొందరు పొలిటీషియన్స్.  తాజాగా అలా నిద్రపొయ్యే విమర్శలు ఎదుర్కొంటున్నారు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్.

వెటర్నరీ డాక్టర్ దిశ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. నిందితులకు మరణశిక్ష విధించాలని ప్రజలు పెద్ద ఎత్తుగా డిమాండ్ చేస్తున్నారు. పొలిటీషియన్స్ కూడా ఈ ఘటనని సీరియస్ గా తీసుకున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా పార్లమెంట్ వేదికగా ఎంపీలు అందరూ ఈ ఘటనని ఖండించారు. చట్టాలు మార్చాలని, నిందితులని కఠినంగా శిక్షించాలని, స్త్రీలకు భరోసా కల్పించాలని ఎంపీలు పార్లమెట్ వేదికగా చెప్పారు. అయితే ఓ వైపు ఇంతలా చర్చ జరుగుతుంటే.. వైసీపీ ఎంపీ మాధవ్ మాత్రం.. ఆ చర్చని ఏదో జోలపాటలా ఫీలవుతూ నిద్రపోయారు. ప్రస్తుతం ఆయన నిద్రపోతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ అమ్మాయిని అతి కిరాతకంగా అత్యాచారం, హత్య చేసిన ఘటనపై.. పార్లమెంట్ సాక్షిగా మిగిలిన ఎంపీలంతా ఆవేదన వ్యక్తం చేస్తూ.. స్త్రీల రక్షణ కోసం మాట్లాడుతుంటే.. ఇలా నిద్ర పోవడం ఏంటంటూ.. ఎంపీ మాధవ్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆయన ఇలా నిద్రపోవడం మొత్తం స్త్రీ జాతినే అవమానించినట్టు అని ఆయనపై తీవ్రస్థాయిలో  ఆగ్రహం వ్యక్తమవుతోంది.