రాజధానిపై సభలో రభస

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అసెంబ్లీలో ఏపీ రాజధాని మీద ప్రకటన చేయనున్న నేపథ్యంలో గురువారం నాడు వైసీపీ సభ్యులు రభస చేశారు. రాజధాని గురించి ప్రకటన ఇచ్చిన తర్వాత చర్చ జరగకూడదని, చర్చ, ఓటింగ్ జరిపిన తర్వాతే ప్రకటించాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. అయితే సభ నియమాల ప్రకారం వ్యవహరిస్తామే తప్ప జగన్ చెప్పినట్టు వినాల్సిన అవసరం లేదని అధికార పక్షం తెలిపింది. ఈ సందర్భంగా ముందుగా చర్చ జరపాల్సిందేనని ప్రతిపక్ష సభ్యులు, సీఎం ప్రకటన తర్వాత జగన్ ఎంతసేపైనా చర్చించవచ్చని అధికార పార్టీ సభ్యులు వాదులాడుకున్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో అసెంబ్లీని గురువారం తొలిసారి పదిహేను నిమిషాల పాటు స్పీకర్ కోడెల వాయిదా వేశారు.