వైసీపీకి షాక్.. మరో కీలకనేత టీడీపీలోకి?

 

గత ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన జగన్.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారం పొందాలని ఆశపడుతున్నారు.. అయితే జగన్ ఆశ ఆశగానే మిగిలిపోయేలాగా ఉంది.. గత ఎన్నికల తరువాత వైసీపీ నేతలు చాలామంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.. దానికి తోడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరికొందరు నేతలు టీడీపీలో చేరుతూ వైసీపీకి షాక్ ఇస్తున్నారు.. తాజాగా ఆ లిస్ట్ లో కాకినాడ వైసీపీలో కీలక నేతగా పేరున్న చెలమలశెట్టి సునీల్ పేరు వినిపిస్తోంది.. ప్రస్తుతం కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.. రీసెంట్ గా అమరావతిలో సీఎం చంద్రబాబును సునీల్ కలిశారని సమాచారం.. టీడీపీలో చేరిక అంశాన్ని బాబు వద్ద సునీల్‌ ప్రస్తావించారని, ఆ మేరకు అక్టోబరు 2న చంద్రబాబు సమక్షంలో అమరావతిలో టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.. గతంలో రెండుసార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన సునీల్ కి స్థానికంగా మంచి పేరుంది.. ఒకవేళ ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరితే కాకినాడ వైసీపీకి గట్టి దెబ్బనే చెప్పాలి.