శ్రీ లక్ష్మికి బెయిల్, చికిత్స కోసం సిఎంసి కి

 

Y. Srilakshmi IAS, Y. Srilakshmi bail, Y. Srilakshmi treatment, Y. Srilakshmi jail

 

 

ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో జైలులో ఉన్న ఐఏఎస్ అధికారిణికి చికిత్స కోసం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తీవ్ర వెన్ను నొప్పితో బాధపడుతున్న ఆమె ఇంత వరకూ, నగరంలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది. అయితే,ఆమె నొప్పి ఇంకా తగ్గకపోవడంతో తమిళనాడులోని వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ లో చికిత్స చేయించుకోవాలని కోర్టుకు విన్నవించుకొంది.



ఆమె బెయిల్ పిటీషన్ ఫై వాదనలు విన్న సిబిఐ ప్రత్యెక కోర్టు న్యాయమూర్తి నిన్న ఆమెకు బెయిల్ మంజూరు చేశారు. ఆమెకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగిసిన వెంటనే కోర్టులో లొంగిపోయేటట్లయితే,బెయిల్ మంజూరు చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని న్యాయమూర్తి శ్రీ లక్ష్మి కి సూచించి అమెనుండి హామీని తీసుకొన్న తర్వాత బెయిల్ మంజూరు చేశారు. దీనితో, ఆమె వెల్లూరు వెళ్ళడానికి అడ్డంకులు తొలగిపోయాయి.