తవ్వకాల్లో దొరికిన 450 కిలోల బాంబు!

 

 

 

ఒకటి కాదు.. రెండు కాదు.. 450 కిలోల బాంబు పశ్చిమ బెంగాల్లోని కలైకుండా ఎయిర్‌బేస్ ప్రాంతంలో వున్న మౌలిషూల్ గ్రామం దగ్గర జరిపిన తవ్వకంలో దొరికింది. ఒక స్ట్రీట్ లైట్ పాతడానికి చిన్న గుంట తవ్వుతూ వుండగా బయటపడిన ఈ భారీ బాంబుని చూసి ఎయిర్‌ఫోర్స్ అధికారులే నోళ్ళు తెరిచారు. ఈ బాంబు నాలుగు అడుగుల పొడవు, రెండు అడుగుల వెడల్పుతో వుంది. భూమిలో మూడడుగుల గుంట తవ్వగానే బయటపడింది. 1939లో తయారైన ఈ బాంబు రెండో ప్రపంచ యుద్ధంలో పేలకుండా మిగిలిపోయిన భారీ బాంబుగా అధికారులు గుర్తించారు. ఈ బాంబు ఇప్పటికీ పేలే స్థితిలోనే వుందని అధికారులు చెబుతున్నారు. ఈ భారీ బాంబుని త్వరలో దూరంగా వున్న అరణ్య ప్రాంతంలోకి తీసుకెళ్ళి డిఫ్యూజ్ చేయనున్నట్టు ఎయిర్ బేస్ అధికారులు వెల్లడించారు.