మరో యువతిపై అత్యాచారం

 

కేంద్ర క్యాబినెట్ గురువారం లైంగిక వేధింపుల నిరోధక సవరణ బిల్లుకు ఆమోదం పొందకముందే గురువారం తెల్లవారు ఝామున ముంబాయిలో ఒక యువతిపై నలుగురు యువకులు అత్యాచారం చేశారు. ముంబాయివంటి మహానగరంలో విల్ పార్లీ సబర్బన్ కు చెందిన టాక్సీ డ్రైవర్ తన ప్రియురాలిని బుధవారం రాత్రి తన ఇంటికి తీసుకొచ్చాడు. ఈ విషయం గమనించిన నలుగురు యువకులు రాజేష్ వర్మ, మహేష్ కేవత్, రామచంద్ర హంబే, కృష్ణ కేవత్ టాక్సీ డ్రైవర్ ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి, అడ్డువచ్చిన అతన్ని కొట్టి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆ నలుగురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.