ఊరిపేరు సిద్ధాంతం..జరిగిందేమో రాద్ధాంతం!

కరోనా టైం లో  కోడల్ని గెంటేసిన అత్తింటి వారు!

పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతంలో దారుణం జరిగింది. కోడల్ని ఇంటి నుంచి బయటకు గెంటివేసి తాళాలు వేసుకున్న అత్తింటి వారి వైఖరిపై స్థానికులు మండిపడుతున్నారు. దీంతో అత్తింటి వారి ఎదుట కోడలు ఆందోళన మొదలెట్టింది. 

నెల క్రితం భర్త గోడి రవికుమార్ చనిపోవడంతో అత్తింటి వద్దే ఉంటున్న కోడలు గోడి వెంకటలక్ష్మి. చనిపోయి నెలరోజులయ్యింది కాబట్టి గుమ్మం దాటి వెళ్లి రమ్మని చెప్పి తీరా వెళ్లిరాగా ఇంటికి తాళాలు వేసి బయటికి పొమ్మన వైనం. తనను ఇంట్లోకి తీసుకువెళ్ళేవరకూ ఇక్కడే ఉంటానని చెప్పి ఇంటి ముందు ఆందోళన చేస్తున్న వెంకటలక్ష్మి. గ్రామసచివాలయంలోనూ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన కోడలు వెంకటలక్ష్మి. కరోనా కారణంగా లాక్డౌన్ ఉండటంతో ఎటుళ్ళాలో తెలియని దయనీయ స్థితిలో ఉన్న వెంకటలక్ష్మి. అయితే, ఇంతవరకూ పోలీసులు స్పందించలేదు.