సీటు బెల్టు రాలేదు.. మంటల్లో చిక్కుకుని కారులోనే మహిళ సజీవ దహనం

మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు కుటుంబంతో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా కారులో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాలో చోటుచేసుకుంది. హైదరాబాద్ కు చెందిన ఉదయ్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి మహారాష్ట్ర వెళ్లాడు. పని అయిన అనంతరం తిరిగి కారులో బయలుదేరగా, బీదర్ జిల్లాలోని మణి కెల్లీ చిరుకప్ప వద్ద కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇద్దరు పిల్లల్ని రక్షించి భార్యను రక్షించే లోగా జరగాల్సిన నష్టం జరిగి పోయింది. భార్య కల్యాణి కారులోనే సజీవ దహనమైంది. 

హైదరాబాదుకు చెందిన ఉదయ్  తన భార్య కల్యాణి కొడుకులు గగన్, సంజీవ్ లతో కలసి మాహరాష్ట్రలో ఒక కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. కర్ణాటకలోని బీదర్ జిల్లా మల్లేపల్లి  వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో ఇద్దరు కుమారులతో అతను బయటపడ్డపడ్డప్పటికీ అతని భార్యను మాత్రం కాపాడుకోలేకపోయాడు. కేవలం సీటు బెల్టు రాకపోవడం వల్ల ఆమె అక్కడే ఇరుక్కుపోయి సజీవ దహనమైంది. ఈ ప్రమాదానికి కారణం చలిగా ఉండటం వల్ల కారులో హీటర్ పెంచుకున్నారు. అందువల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కల్యాణి మృతదేహం మాత్రం బీదర్ లోని ప్రభుత్వాసుపత్రి తరలించారు. కల్యాణి మృతదేహాం పోస్టు మార్టం తర్వాత హైదరాబాద్ కి చేరుకునే అవకాశం ఉంది.