మూడేళ్ళపాటు బాత్‌రూమ్‌లో బంధించారు...

 

వరకట్న పిశాచి వికృతరూపం అత్తవారింటి రూపంలో మరోసారి కనిపించింది. అదనపు కట్నం తేలేదని ఒక యువతిని అత్తింటివారు దారుణంగా హింసించి బాత్‌రూమ్‌లోంచి మూడేళ్ళపాటు బయటకి రాకుండా బంధించారు. మహారాష్ట్రలోని దర్బంగా పట్టణంలో ఈ దారుణం జరిగింది. మూడేళ్ళపాటు బాత్‌రూమ్‌లో మగ్గిన యువతిని పోలీసులు బయటకి తీసుకొచ్చారు. అదనపు కట్నం తేలేదని, ఆడపిల్లని కన్నానని తనను తన అత్తింటివారు చిత్రహింసలకు గురిచేశారని ఆమె పోలీసులకు తెలిపింది. తన పుట్టింటి వారు తనను చూడటానికి వచ్చినా బయటి నుంచి బయటే పంపించేవారని ఆమె రోదిస్తూ చెప్పింది. ఈ నేపథ్యంలో అదనపు కట్నం కోసం రాక్షసుల్లా ప్రవర్తించిన బాధితురాలి భర్త ప్రభాత్ కుమార్ సింగ్, ఆమె మామ ధీరేంద్ర సింగ్, అత్త ఇంద్రాదేవిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.