భర్తని పాతేసి నాట్లు వేసిన మహా ఇల్లాలు

 

చిత్తూరు జిల్లాలో ఒక మహా ఇల్లాలు తన ప్రియుడి కోసం భర్తని చంపేసి పొలంలో పాతేసింది. తర్వాత భర్తని పాతిన చోట వరి నాట్లు కూడా వేసింది. ఈ కేసులో ఇంకో దారుణం ఏమిటంటే, భర్తని చంపడానికి ఆమె ప్రియుడితోపాటు తన కొడుకు సహకారం కూడా తీసుకుంది. చిత్తూరు జిల్లా నాగులాపురం మండలం గోపాలపురంలో ఈ దారుణమైన సంఘటన జరిగింది. అయితే చనిపోయిన వ్యక్తి తల్లిదండ్రులు తమ కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణ సంఘటన బయటపడింది.