హుదూద్ తుఫాను ప్రభావం... విశాఖ అల్లకల్లోలం..

 

ముంచుకొచ్చిన హుదూద్ తుఫాను విశాఖపట్టణం నగరాన్ని అల్లకల్లోలం చేసింది. విద్యుత్ స్తంభాలు విరిగి పడిపోయాయి. సెల్ టవర్లు కూలిపోయాయి, అనేక ఇళ్లు కుప్పకూలాయి, అపార్టుమెంట్లు బీటలు వారాయి. పెద్దపెద్ద చెట్లు రోడ్డుకు అడ్డంగా విరిగి పడిపోయాయి. కమ్యూనికేషన్లు దారుణంగా దెబ్బతిన్నాయి. హోర్డింగులు పడిపోయాయి. తుఫాను కారణంగా భారీ సంఖ్యలో జంతువులు మరణించాయి. అయితే రవాణాకు పరిస్థితులు ఎంతమాత్రం అనుకూలంగా లేకపోవడం వల్ల అధికారులు ఆ పశువులను తొలగించడం ఎలాగా అని మల్లగుల్లాలు పడుతున్నారు. రోడ్లమీద పడి ఉన్న పశు కళేబరాలు కుళ్ళిపోవడం కారణంగా అంటువ్యాధులు ప్రబలుతాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.