విశాఖలో ఆత్మవిశ్వాస ర్యాలీ

 

విశాఖ తుఫాను బాధితులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఆత్మవిశ్వాస ర్యాలీ బుధవారం రాత్రి విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఈ ర్యాలీని ప్రారంభించారు. చేతిలో కాగడాలు పట్టుకుని విశాఖలో పర్యటించారు. ఈ ర్యాలీలో పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, విశాఖ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.