సస్పెన్షన్: కెసిఆర్ కు విజయశాంతి కృతజ్ఞతలు

 

KCR Vijayashanthi,  TRS suspend MP Vijayashanthi

 

 

టీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ కు గురైన మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి బహిరంగ లేఖ రాశారు. ఆరేళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితి లో పనిచేసేందుకు అవకాశం ఇచ్చిన అన్న, పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. తనకు సస్పెన్షన్ షోకాజ్ ఇంకా అందలేదని, అందాక దానిపై స్పందిస్తానని పేర్కొన్నారు. అమరవీరుల త్యాగ ఫలితం వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు. మెదక్ ప్రజలకు తన ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. విజయశాంతి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని ఆమె అనుచరుడు రఘువీర్ తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదన్నరు. అలాంటప్పుడు వేటు ఎందుకు వేస్తారని ప్రశ్నించారు.