సోనియాను క‌లిసిన రాముల‌మ్మ

 

టి ఆర్ ఎస్ బ‌హిష్కృత నేత విజ‌య‌శాంతి, యుపిఏ అద్యక్షురాలు సోనియా గాందిని క‌లిశారు. ఏఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌద‌రితో క‌లిసి ఆమె సోనియా నివాసానికి వెళ్లారు. విజ‌య‌శాంతి పార్టీ వ్యతిరేక కార్యక‌లాపాల‌కు పాల్పడుతుంద‌న్న ఆరోప‌ణ‌లతో ఇటీవ‌లే టిఆర్ఎస్ పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది.

కొద్దిరోజులుగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నవిజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీలో త‌న‌కు స‌ముచిత స్ధానం ద‌క్కటం లేద‌న్న ఆసంతృప్తితో ఉన్న ఆమె పార్టీకి దూర‌మ‌వుతూ వ‌చ్చారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూల నిర్ణయాన్ని ప్రకటించిన సందర్భంలో కూడా ఆమె పార్టీ కార్యాల‌యానిక రాలేదు.

ఈ ప‌రిస్థితుల్లో విజ‌య‌శాంతి సోనియాను క‌ల‌వ‌డంతో ఆమె కాంగ్రెస్ చేర‌టం కాయంగానే క‌నిపిస్తుంది. ఇంత‌వ‌ర‌కు అధికారికంగా ప్రక‌టించ‌క‌పోయినా త్వర‌లోనే ప్రక‌ట‌న వెలువ‌డ‌వ‌చ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.