కాంగ్రెస్ పై చంద్రబాబుకు ఎందుకంత ప్రేమ

 

బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా దేశంలోనే బీజేపీకి ప్రధాన ప్రతి పక్షం అయిన కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు చేతులు కలిపారు.అయితే ఈ మైత్రి బంధంపై పలువురు నేతలు విమర్శలు చేయగా తాజాగా వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్‌ వేదికగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.ఆయన ట్విట్టర్ లో  ‘ఎంత డబ్బు అయినా పంపిస్తా, టీఆర్‌ఎస్‌ మాత్రం గెలవొద్దంటూ తెలంగాణ కాంగ్రెస్‌ పెద్దలకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నాడట. ఇంత ప్రేమ ఎందుకంటే కేసీఆర్‌ మళ్లీ గెలిస్తే ఓటుకు నోటు కేసు విచారణ స్పీడప్‌ చేసి ఎక్కడ లోపల వేస్తాడోనని' అని ట్వీట్ చేశారు.