విజయశాంతి,బాలయ్య,చిరు కలిసి ప్రచారం చేయనున్నారా?

 

తెలంగాణ లో ముందస్తు ఎన్నికలు రావటం,తెరాస ప్రభుత్వాన్ని గద్దె దింపటానికి తెలుగు దేశం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటంతో ఎన్నికల ప్రచారం ఎలా ఉండబోతుందో అని అందరికి ఆసక్తి నెలకొంది.ఇప్పటికే తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే , నటుడు బాలకృష్ణ ఖమ్మం జిల్లా లో పర్యటించి ప్రచారం ప్రారంభించారు.అలానే కాంగ్రెస్ పార్టీ విజయశాంతికి ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచార భాద్యతలు అప్పగించటంతో అన్ని నియోజక వర్గాల్లో పర్యటించి ప్రచారం చేయనున్నట్లు తెలిపారు.చిరంజీవి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్నారు.మరి టీడీపీ,కాంగ్రెస్ పొత్తుతో ఏకమవుతున్న వీరు ఒకే వేదికపై ప్రచారం చేస్తే కన్నుల పండుగగా ఉంటుందని కార్యకర్తలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు టీఆర్ఎస్ నేతగా ఉన్న విజయశాంతి ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు.ఇప్పుడు ఇద్దరు ఒకటే పార్టీ కాబట్టి పార్టీ ఆదేశాల మేరకు కలిసి పని చేయవలసి వస్తే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని విజయశాంతి తెలిపినట్లు సమాచారం.మరి ఈ ముగ్గురి కలయిక ఎప్పుడో? వీరి ప్రచారం తో రాజకీయ వాతావరణం ఎంత వేడెక్కనుందో?.