విజయ్‌ మాల్యా ఇండియాకు తిరిగొస్తున్నాడు..!!

విజయ్‌ మాల్యా.. ఇండియాలో ఈ పేరు తెలియనివాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.. ఒకటా రెండా కొన్ని వేల కోట్ల రుణాలు బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసాడు.. వేలల్లో రుణాలు తీర్చని సామాన్యులపై ప్రతాపం చూపించే అధికారులు, వేల కోట్ల ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన విజయ్‌ మాల్యాను ఏం చేయలేకపోతున్నారంటూ అధికారులపై విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి.. అయితే త్వరలో మాల్యా ఇండియాకు రాబోతున్నట్టు తెలుస్తోంది.

 

 

పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల ఆర్డినెన్స్‌ కింద మాల్యాపై చర్యలు తీసుకోవాలని ఈడీ ఇటీవల ముంబయిలోని అవినీతి నిరోధక చట్టం ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరింది.. దీంతో కోర్టు ఆగస్టు 27న న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని మాల్యాకు సమన్లు జారీ చేసింది.. మాల్యా బ్యాంకులకు దాదాపు రూ.9వేల కోట్లు ఎగ్గొట్టగా.. ఈ ఆర్డినెన్స్‌ ద్వారా ఆయనపై చర్యలు తీసుకుంటే మాల్యాకు చెందిన రూ.12,500కోట్లు జప్తు చేసుకునే అధికారం ఉంటుంది.. కోర్టు సమన్లు జారీ చేసిన ప్రకారం,చెప్పిన తేదీకి మాల్యా కోర్టు ఎదుట హాజరుకాకపోతే మాల్యాను పారిపోయిన ఆర్థిక నేరగాడుగా ప్రకటించే అవకాశం ఉంది.. అయితే, మాల్యా ఇండియాకి తిరిగి వచ్చి న్యాయ విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.. ఇప్పటికే మాల్యా తన ప్రతినిధులను దర్యాప్తు సంస్థల వద్దకు పంపి ఈ విషయాన్ని చెప్పినట్లు సమాచారం.. మాల్యా ఇండియాకు ఎప్పుడొస్తాడో?.. శిక్ష ఏం పడుతుందో? చూద్దాం.