పాక్‌ని పొగిడేవాళ్ళని చెప్పుచ్చుక్కొట్టాలి...

 

భారతదేశంలో వుంటూ పాకిస్థాన్‌ని పొగిడేవాళ్ళని చెప్పుచ్చుకుని కొట్టాలని విశ్వహిందూ పరిషత్ నాయకురాలు బాలికా సరస్వతి అన్నారు. పాకిస్థాన్‌కి అనుకూలంగా మాట్లాడేవారిని పాకిస్థాన్‌కే తరిమి కొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. అలాంటి వారిని ఎంతమాత్రం సహించరాదు.. ఉపేక్షించరాదు అని ఆమె అన్నారు. ఈ దేశంలో వుంటూ ఇక్కడి తిండి తింటూ పరాయిదేశం పాకిస్థాన్‌ని పొగిడేవారిని చెప్పుతో కొట్టాలి. వారిని ఎంతమాత్రం సహించరాదు.. దెబ్బకు దెబ్బ తీయాలి అని అన్నారామె. అయోధ్యలో రామమందిరం నిర్మించాలని, పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌‌లో కూడా రామమందిరం నిర్మించాలని, మనం అక్కడకి వెళ్ళి పూజలు చేయాలని ఆమె వ్యాఖ్యానించారు. భారతీయులందరూ ఆయుధాలు పట్టుకోవాల్సిన సమయం వచ్చిందని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.