రిషి కపూర్‌కి అస్వస్థత

 

ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషి కపూర్ అస్వస్థతకు గురయ్యారు. బాలీవుడ్ దిగ్గజాలు పృథ్విరాజ్ కపూర్, రాజ్ కపూర్‌లకు మనవడు, కుమారుడు అయిన రిషి కపూర్ అనేక హిందీ సినిమాలలో కథానాయకుడిగా నటించి స్టార్ హోదాని సంపాదించుకున్నారు. ప్రస్తుత బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ రిషి కపూర్ తనయుడే. 62 సంవత్సరాల రిషి కపూర్‌ డెంగ్యూ మలేరియా కారణంగా బుధవారం నాడు అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ని ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్ల నిరంతర పర్యవేక్షణలో ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో రిషి కపూర్‌ని వైద్యులు గురువారం రాత్రి డిశ్చార్జ్ చేశారు. రిషి కపూర్ పూర్తిగా కోలుకున్నారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.