మోడీ ఎప్పుడో వార్నింగ్ ఇచ్చారు..

 

పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నేతలు మోడీ తీసుకున్న ఈ నిర్ణయంపై మండిపడుతున్నారు. అయితే ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ..  కేంద్ర ప్ర‌భుత్వం దేశంలో న‌ల్ల‌ధ‌నాన్ని వెలికి తీసే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని..  ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌లించేందుకు విప‌క్షాలు ప్ర‌య‌త్నిస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తాము చెందుతున్న ఆందోళ‌న నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని, నిజానిజాల‌ను ప‌రిశీలించాల‌ని సూచించారు. 50 రోజులు ఓపిక ప‌ట్టాల‌ని ఎందుకింత హ‌డావుడి చేస్తున్నార‌ని ఆయ‌న ప్ర‌తిప‌క్షాల‌ను ప్ర‌శ్నించారు. భార‌తీయులు ఎవ్వ‌రూ మోదీ తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల ప్ర‌శ్నించ‌డం లేద‌ని.. ప‌న్ను ఎగ్గొడుతున్న వారికి ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ ఎప్పుడో వార్నింగ్ ఇచ్చారని తెలిపారు.