తెలంగాణ బిల్లును ఓడిస్తాం: మంత్రి వట్టి
posted on Aug 14, 2013 11:53AM
పశ్చిమ గోదావరి జిల్లా గనపవరంలో మంత్రి వట్టి వసంత్ కుమార్ ని ఎపిఎన్జీవోలు అడ్డుకుని రాజినామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి వసంతకుమార్ మాత్రం అందుకు అంగీకరించలేదు. రాజీనామా అనేది ఆఖరి అస్త్రమని.. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు ఓడించాక రాజీనామా చేస్తానన్నారు. మంత్రి పదవులకు రాజీనామా చేస్తే లాభముండదన్నారు. అందరు రాజీనామా చేస్తే రాష్ట్రపతి పాలన వస్తుందని తెలిపారు.
పార్టీలకతీతంగా సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడించాలని వట్టి కోరారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనే దృఢ నమ్మకం తమకుందన్నారు. రాజీనామాలు ఆఖరుగా ప్రయోగించాల్సిన అస్త్రమన్నారు.ఎన్.జి.ఓలు మాత్రం సమైక్యాంద్ర అంటూ, మంత్రులు,ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని నినాదాలు చేశారు.