వైఎస్ జగన్ పార్టీలోకి వసంత నాగేశ్వరరావు
posted on Dec 21, 2012 12:59PM
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వర రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరారు. కృష్ణా జిల్లాలో జరిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహావిష్కరణ సభలో ఆయన జగన్ గూటిలో చేరారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా కన్వీనర్ ఉదయ భాను పార్టీ కండువా కప్పి వసంతను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ, వై ఎస్ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ది చెందిందని అన్నారు.
తనను ఎవరూ పట్టించుకోని రోజుల్లో రాజ శేఖర రెడ్డి తనకు కేడిసిసి బ్యాంకు అధ్యక్ష పదవి కట్టబెట్టారని ఆయన అన్నారు. ఆలాంటి నేత ఋణం తీర్చుకోవడానికే తాను ప్రస్తుతం ఆయన కుమారుడి పార్టీలో చేరుతున్నానని అన్నారు. కొత్త పార్టీలో తాను ఓ సామాన్య కార్యకర్తగా కొనసాగాలని భావిస్తున్నాని వసంత అన్నారు. వసంత గతంలో నాప్కాబ్ ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు.