వి.హెచ్. ఆవేదన..కేసిఆర్ పునరాలోచించుకోవాలి

 

 

 

తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో వీలినం చేస్తానని మాటిచ్చిన కేసిఆర్, ఇప్పుడు సడన్ గా మాట మార్చడంపై పునరాలోచించుకోవాలని ఎంపీ వి. హనుమ౦తరావు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుందని తెలిసినా, తెలంగాణ విద్యార్ధుల ఆత్మబలిదాలను చూసి చలించిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు వచ్చారని అన్నారు. కేసిఆర్ వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకాలేదని అన్నారు. కేసిఆర్ స్వార్ధరాజకీయపరుడని ఆరోపించారు. కుటుంబంతో వెళ్ళి సోనియాని కలిసిన కేసిఆర్, అమరవీర కుటుంబాలను ఎందుకు తీసుకువెళ్ళలేదని ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని నమ్ముకుంటే కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు తప్పదని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు అన్న మాటలు నిజమవుతుంటే భరించలేక ఆయన ఆవేదన చెందుతున్నారు!