ఉండవల్లి సోనియాను అవమానించడమే.. వీహెచ్



 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత వీ హనుమంత రావు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీరును విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపైన  చర్చ జరగాలని.. రాజ్యాంగం, పార్లమెంట్ నియమ నిబంధనలకు లోబడి ఏపీ పునర్విభజన చట్టం ఉభయ సభల ఆమోదం పొందిందా? లేదా? అన్న విషయంపై సమగ్రంగా ఆరా తీసి జరిగిన నష్టాన్ని సరిదిద్దాలని ఉండవల్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేస్తూ పుస్తకం ఇచ్చారు. దీనికి వీహెచ్ స్పందిస్తూ ఉండవల్లి చేసిన పని సరైనది కాదని.. రాష్ట్ర విభజన ఉభయ సభల ఆమోదం పొందిన తరువాత జరిగిందేనని.. ఇప్పుడు ఉండవల్లి ఇలా చేయడం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని అవమానించడమే అని అన్నారు.