ఐరాస ఆమోదం పొందిన శ్రీలంకపై తీర్మానం

 

శ్రీలంకలో మానవ హక్కుల మండలి ఉల్లంఘనపై అమెరికా నేతృత్వంలో  తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. మొత్తం 47 సభ్యదేశాలు ఉన్న మండలి గురువారం ఈ తీర్మానంపై ఓటింగ్ నిర్వహించగా భారత్ సహా 25 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా, పాకిస్తాన్తో పాటు 13 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశారు, 8 ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. దీంతో మానవ హక్కుల మండలి ఈ తీర్మానాన్ని ఆమోదించింది. శ్రీలంకలో మానవహక్కుల ఉల్లంఘనపై స్వతంత్ర, విశ్వసనీయ దర్యాప్తు నిర్వహించాలని, 2009లో ఐరాస  శ్రీలంక మానవహక్కుల మండలికి ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదని, దీర్ఘకాలం కొనసాగిన సంక్షోభం ముగిసిన తరువాత తమిళులతో పాటు అన్ని వర్గాల అంగీకార యోగ్యమైన రాజకీయ పరిష్కారాన్ని అమలు చేయడానికి శ్రీలంకకు ఇదొక అపూర్వమైన అవకాశం అని భారత శాశ్వత ప్రతినిధి దిలీప్ సిన్హా శ్రీలంకకు హితబోధ చేశారు.