విజయవాడలో కలకలం.. పరువు హత్య పోస్టర్లు..!!

 

మిర్యాలగూడలో ఈమధ్య పరువు హత్య జరిగిన సంగతి తెలిసిందే. ప్రణయ్ అనే వ్యక్తిని మామ మారుతీరావు దారుణంగా చంపించాడు. ఈ హత్య దేశ వ్యాప్తంగా సంచలం రేపింది. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే ఇదే తరహా దాడి హైదరాబాద్ లో ఒక జంట మీద జరిగింది. ఈ ఘటనలో యువతి తీవ్రంగా గాయపడింది. ఇలా వరుస సంఘటనలతో ప్రేమికుల్లో భయం మొదలైంది. మొన్నటికి మొన్న గుంటూరులోని కొన్ని ప్రేమ జంటలు మాకు రక్షణ కావాలంటూ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించాయి. అయితే ఇప్పుడు విజయవాడలో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. విజయవాడలో పరువు హత్య పేరుతో వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. సోని రాహు ప్రియ పరువు హత్యకు గురికానున్నారంటూ ముద్రించిన పోస్టర్లు నగరంలో వెలిశాయి. సత్యనారాయణపురం శివాలయం వీధిలో ఈ పోస్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు అతికించారు. అయితే భయపెట్టే ఉద్దేశ్యంతోనే ఇలా చేసారని స్థానికులు భావిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు పోస్టర్లలో పేర్కొన్న సోని రాహు ప్రియ ఎవరు? పోస్టర్లు వేసింది ఎవరు? అనే కోణంలో విచారణ చేపట్టారు.