బిజెపి తెలంగాణ ఇవ్వలేదు: ఉండవల్లి

 

Undavalli Telangana, congress Undavalli, Undavalli Arun Kumar Telangana

 

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా చేయాలని రాజమండ్రి కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ పైన ఉన్న ప్రేమతో సీమాంధ్రులు విశాఖను విస్మరించారన్నారు. దేశ ప్రజలు ఒప్పుకుంటేనే రాష్ట్ర విభజన ఆపలేమన్నారు. రాష్ట్రం విడిపోయినా వచ్చే ప్రమాదమేమీ లేదని అన్నారు. దేశానికి మేలు జరిగే ఏ అభిప్రాయమైన తెలంగాణ, సీమాంద్ర నేతలు అంగీకరించాలని చెప్పారు.

 

టీఆర్ఎస్ నేతలు తెలంగాణ ప్రజలకు అవాస్తవాలను చెప్పి, సీమాంధ్రులను దోపీడీ దొంగలుగా ముద్ర వేస్తున్నారని అన్నారు.  తెరాస నేతలు ఇరుప్రాంతాల మద్య విద్వేషాలు రగిలించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. బిజెపి అధికారంలోకి వచ్చినా తెలంగాణ ఇవ్వలేదని అంటున్నారు. బిజెపి ఇచ్చిన మాటపై నిలబడలేదన్నారు. కాకినాడ ఒక వోటు రెండు రాష్ట్రాల తీర్మానం ఏమైందని ప్రశ్నించారు.